మాదాసి కురువలుగా గుర్తించాలి



కర్నూలు: కురువ/కురుబలను మాదాసి కురువలుగా గుర్తించి ఎస్సీ జాబితాలో చేర్పించాల‌ని కురువ సంఘం నాయకులు రామలింగారెడ్డి, బొంబాయి సుధాకర్, ఎర్రిస్వామి కోరారు. ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్‌ను తుగ్గలిలో వారు కలసి జీఓ 31 ప్రకారం కురువ/కురుబలను మాదాసి కురువలుగా గుర్తించి ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరారు. వైయ‌స్‌ జగన్‌ స్పందిస్తూ ఈ విషయమై తమ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్‌ యాదవ్‌ ఆధ్వర్యంలో అధ్యయనం చేయిస్తానన్నారు.

తాజా వీడియోలు

Back to Top