కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదు

గుంటూరు:  ‘జిల్లా స్థాయిలో రేషన్‌ దుకాణాలకు నిర్వహించే పరీక్ష రాశాను. ఉత్తీర్ణత సాధించాను. ఇంటర్వ్యూకు కూడా హాజరయ్యా. కానీ దివ్యాంగురాలైన నాకు రేషన్‌ దుకాణాన్ని కేటాయించకుండా.. టీడీపీ వారికే కట్టబెట్టారు’ అంటూ జయశ్రీ  వైయ‌స్ జగన్‌ వద్ద వాపోయింది. పాదయాత్రలో భాగంగా సోమవారం భావపురి చేరుకున్న వైయ‌స్ జగన్‌మోహన్‌రెడ్డిని మార్గమధ్యంలో స్టూవర్టుపురం వద్ద సమస్యను విన్నవించింది. రెండు పర్యాయాలు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేసింది.    


Back to Top