వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
నేను రైతు బాంధవుడిని..కాదు రైతు సైందవుడివి
12 Sep 2015 5:12 PM
చంద్రబాబు రైతు యాత్ర మొదలుపెట్టాడు. యాత్రకు ముందు కొబ్బరికాయ కొట్టి ఆయన వీరభక్తులు ఉపన్యాసం మొదలుపెట్టారు.``చంద్రబాబంటే మామూలు వ్యక్తికాదు, శక్తి రైతుల్ని తుఫానులా ముంచెత్తే శక్తి. ఈ రోజు కొబ్బరికాయ కొడుతున్నామంటే కొబ్బరి రైతులకి మేలు చేస్తున్నామని అర్థం, కొబ్బరి నాయకులు తిన్న, చిప్పమాత్రం రైతులకి గ్యారంటీ`` అన్నారు.
గన్మ్యాన్లను వెంటేసుకుని పొలాల వెంట బాబు నడకసాగించాడు. ఒక చోట ఒకాయన తాళ్ళు అమ్ముతూ కనిపించాడు.
బాబు వాడిని పిలిచి `` అరే తిక్కలోడా, చేదబావులు ఎండిపోయి ఏళ్ళయింది కదా, ఇప్పుడే తాళ్ళు ఎవరికి అమ్ముతున్నవ్`` అని అడిగాడు.
`` బాబూ మీ దయ వల్ల బావులేకదా, పంటలు కూడా ఎండిపోయాయి. రైతుల్ని ఆదుకునేవాడు, చేదుకునే వాడు లేడు. పండితే ధరవుండదు, పండకపోతే అన్నముండదు. ఒకవేళ పండుతాయని ఆశపడినా ఆ భూముల్ని మీరు ఎలాగోలా లాక్కుంటారు. అందువల్ల రైతులకి బతకడం కంటే చచ్చిపోవడమే ఇప్పుడు సులభం, పల్లెటూళ్ళల్లో ఇప్పుడు మూడుముళ్ళేసుకునే వాళ్ళకంటే తాడుముళ్ళు వేసుకునే వాళ్ళే ఎక్కువయ్యారు.
నేనూ రైతునే బాబు, రైతుల కష్టం చూడలేక తక్కువ ధరలకి ఈ తాడుని అమ్ముతున్నా, నొప్పి తెలియకుండా వుండడానికి తాళ్ళకి నూనె కూడా రాశాను. ఈ తాళ్ళను కానీ మీ చేతులతోనే రైతులకి నాలుగు పంచండి బాబూ ధర్మ ప్రభువులు ``అన్నాడు తాళ్ళు అమ్మేవాడు.
``ఇదంతా కుట్ర, ప్రతిపక్షాలు నా మెడకి తాడు బిగించాలని చూస్తున్నాయి. రైతులకి నేను ఎంతో చేశాను`` అన్నాడు బాబు కోపంగా
``అవును చాలా చేశారు. నీళ్ళు ఎపుడొస్తాయో తెలియని పట్టిసీమని జాతికి అంకితం చేశారు``
`` విడియో కాన్ఫరెన్స్లు పెట్టి రైతుల సమస్యలపై చర్చించాను``
``కంపూటర్లలో రైతుల కనీ్నళ్ళు కనిపిస్తాయా సామీ, రైతులు అర్థం కావాలంటే ముందు మీ గుండెల్లో తడి వుండాలి. నాయకుడితో తడిలేకపోతే మడిపారదు``
`` నేను రైతు బాంధవుడిని``
`` కాదు రైతు సైందవుడివి`
``వీడి నోరు మూయించండి``
పోతీసులొచ్చి తాళ్ళవాడిని లాక్కెళ్ళారు.
``ఒక నోరు మూయిస్తే వందనోళ్ళు తెరుచుకుంటాయి బాబు గారూ``
ఇంతలో రెండు అస్తిపంజరాలు బాబు దగ్గరకొచ్చాయి. కెవ్వున కేకేశాడు. ఆ అస్తిపంజరాలు ఏదో చెప్పడానికి ప్రయత్నించాయి.
`` దెయ్యాలు, దెయ్యాలు`` అని బాబు అరిచాడు
``దెయ్యాలు కాదు చంద్రబాబు, మీ పాలనలో ఎండిపోయిన రైతులు వాళ్ళు మీరిపుడు చేయాల్సింది పరామార్శయాత్ర కాదు, రైతుల అంతిమయాత్ర రైతుల్ని శిలువవేయించిన పుణ్యం మీకే దక్కుతుంది`` అన్నాడు తాళ్ళవాడు.
అస్తిపంజరాల్ని గన్మెన్ తరిమేశారు.
`` రైతులకి నేనెంతో చేశాను. పురుగుల మందుల్ని సబ్సిడిగా ఇచ్చాను`` అని ఉపన్యాసం ఎత్తుకున్నాడు బాబు
`` వాటిని అన్నంలో కలుపుకుని రైతులు తింటున్నారు`` అని గొణుక్కుంటూ తాళ్ళవాడు వెల్ళిపోయాడు
యాత్ర సాగింది