‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర.. 17వ రోజు షెడ్యూల్ వైయస్ జగన్పై దాడి చేయించిన అసలు దొంగ చంద్రబాబే..! ఓటుకు నోటు కేసు.. చంద్రబాబును నిందితుడిగా చేర్చాలివైయస్ జగన్ మళ్లీ తప్పకుండా గెలుస్తారుఏపీలో ‘ఫ్యాన్’దే హవా.. శ్రీ సీతారాముల ఆశీస్సులతో సకల శుభాలు కలగాలి ప్రతి ఇంట్లో జగనే కావాలి.. జగనే రావాలి అంటున్నారు పేదలకు మంచిచేస్తున్నందుకే జగనన్నపై వారికి ద్వేషంసీఎంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన చంద్రబాబుపై చర్యలు తీసుకోండి ఆర్బీకేల సహకారంతో మేమంతా సకాలంలో పంటలు వేయగలుగుతున్నాం
ఈ మృగానిది మాయదారి రోగం
02 Mar 2022 2:47 PM
తప్పుడు వార్తలతోనే కాదు..తెలివితక్కువ తనం బుర్రతక్కువతనాన్ని ప్రదర్శించుకోడంలోనూ ఆంధ్రజ్యోతి ఎప్పుడూ ముందుంటుంది.
మిలాన్ -2022లో ముఖ్యమంత్రి జగన్ రాష్ట్ర జంతువును మృగం అన్నారని..అదివిని అందరూ నవ్వేసారని ఓ పిల్లిపిత్తిరి వార్త ఒకటి రాసి పారేసింది అంధజ్యోతి..పైగా జగన్ కు సబ్జెక్ట్ పై అవగాహన లేందంటూ తన వెకిలితనాన్ని ప్రదర్శించింది.
మృగం అనేదానికి జంతువు అని, జింక అనే అర్థం కూడా ఉంటుందని తెలీని తెగులు బ్యాచ్ అంతా ఆ పేపర్లోనే ఉన్నట్టుంది మరి.
జగన్ మీద రాయడానికి వేయడానికి గులకరాళ్ల నుంచి బండరాళ్ల దాకా ఏరుకునే పనిలో తలమునకలుగా ఉండటమే కాదు..కాస్త తెలుగు పదాలకు అర్థాలు తెలుసుకుని తెలుగు పత్రిక నడపాలన్న ఇంగిత జ్ఞానం ఆ అడ్డగోలుజ్యోతికి కలగనే కలగదు.
పచ్చపార్టీకి ఊడిగం చేసే ఈ పేపర్ మృగానికి కోడిగుడ్డుమీద ఈకలు పీకే మాయదారి రోగం పోనూ పోదు.