డీఎస్సీ అక్రమాలపై రాష్ట్రవ్యాప్తంగా వైయ‌స్ఆర్‌సీపీ రిలే నిరాహార దీక్షలు

 దీక్షలను అడ్డుకునేందుకు పోలీసుల ప్రయత్నాలు.. పలు చోట్ల ఉద్రిక్తత

 టెంట్లు తొలగింపు.. విజయవాడలో దాడులతో ఉద్రిక్త పరిస్థితులు

తాడేపల్లి : డీఎస్సీ నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయ‌స్ఆర్‌సీపీ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన రిలే నిరాహార దీక్షలు రాజకీయంగా తీవ్ర చర్చకు దారితీశాయి. డీఎస్సీ అభ్యర్థులు, ఉపాధ్యాయ సంఘాల మద్దతుతో వైఎస్సార్‌సీపీ యువజన విభాగం ఆధ్వర్యంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు నియోజకవర్గ కేంద్రాల్లో ఈ దీక్షలు ప్రారంభమయ్యాయి.

దీక్షలు ప్రారంభం కాకముందే పలుచోట్ల పోలీసులు జోక్యం చేసుకుని అనుమతులు లేవని చెబుతూ కార్యక్రమాలను అడ్డుకునే ప్రయత్నం చేశారు. కొన్ని ప్రాంతాల్లో నిరసనల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయినప్పటికీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు నిరసనలను కొనసాగించారు.

పలుచోట్ల దీక్షలు కొనసాగుతుండటంతో పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారాయి. విజయవాడలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరం వద్ద ఘర్షణ చోటుచేసుకుంది. వైఎస్సార్‌సీపీ ఆరోపణల ప్రకారం, టీడీపీకి చెందిన వ్యక్తులు శిబిరంపై దాడి చేసి టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లు విసిరారు. నిరసనల కోసం ఏర్పాటు చేసిన టెంట్లను ధ్వంసం చేయడంతో పాటు మహిళా కార్యకర్తలు, జర్నలిస్టులు, పోలీసులపైనా దాడులకు పాల్పడినట్లు ఆరోపించారు. ఈ ఘటనలో ఒక వ్యక్తి శిబిరంపై ఉన్న వారిపై మూత్రం పోసిన ఘటన తీవ్ర విమర్శలకు దారితీసింది.

రాష్ట్రంలోని మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయని వైయ‌స్ఆర్‌సీపీ పేర్కొంది. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న నిరసనలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు దాడులను అడ్డుకోవడంలో విఫలమయ్యారని ఆరోపించింది. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై పూర్తి స్థాయి సీబీఐ దర్యాప్తు జరిపించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌సీపీ డిమాండ్ చేసింది. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరింది. అరెస్టులు, నిర్బంధాలు, దాడులు జరిగినా తమ పోరాటం ఆగదని వైయ‌స్ఆర్‌సీపీస్పష్టం చేసింది. డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకు, అక్రమాలపై సీబీఐ విచారణకు ప్రభుత్వం అంగీకరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా తమ ఆందోళనలు కొనసాగుతాయని పార్టీ నాయకత్వం ప్రకటించింది.

 - గాజువాకలో రిలే నిరాహార దీక్ష

 డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విశాఖపట్నం జిల్లా గాజువాక నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. గాజువాక నియోజకవర్గ సమన్వయకర్త తిప్పల శ్రీనివాస దేవన్ రెడ్డి ఆధ్వర్యంలో పెదగంట్యాడ జంక్షన్‌లో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమం ఏపీ జెన్-జెడ్ వార్ కార్యక్రమంలో భాగంగా జరిగింది. 64, 65, 74, 75, 76 వార్డులకు చెందిన నాయకులు, డీఎస్సీ అభ్యర్థులతో కలిసి రిలే నిరాహార దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాల్లో చోటుచేసుకున్నట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అవకతవకలపై సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, అభ్యర్థులకు న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు, రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులు, వార్డు అధ్యక్షులు, వార్డు పరిశీలకులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ, వార్డు అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాల ప్రతినిధులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- ఉంగుటూరులో..

ఏలూరు, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉంగుటూరు నియోజకవర్గ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల వాసు బాబు ఆధ్వర్యంలో ఉంగుటూరులో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా పుప్పాల వాసు బాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి సంతకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి "ధగా డీఎస్సీ"గా మార్చి నిరుద్యోగుల జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో వెలుగుచూస్తున్న అక్రమాలపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని, అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

- ఎచ్చెర్ల‌లో.. 

శ్రీకాకుళం, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్ల నియోజకవర్గంలోని లావేరు మండల కేంద్రంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
ఈ నిరాహార దీక్షలో ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పాల్గొని ప్రభుత్వ తీరును తీవ్రంగా విమర్శించారు. ఏళ్ల తరబడి కష్టపడి చదివిన నిరుద్యోగ యువతకు న్యాయం చేయాల్సిన ప్రభుత్వం డీఎస్సీ నిర్వహణలో తీవ్ర అక్రమాలకు పాల్పడిందని అన్నారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుని అర్హులైన అభ్యర్థులకు పూర్తి న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిగే వరకు, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే వరకు పార్టీ వెనక్కి తగ్గదని తెలిపారు. మెగా డీఎస్సీ పేరుతో "దగా డీఎస్సీ" నిర్వహించి అర్హులకు కాకుండా అనర్హులకు ఉద్యోగాలు కల్పించేలా ప్రభుత్వం చీకటి జీవోలు తీసుకొచ్చిందని ఆరోపించారు. డీఎస్సీ నియామకాలను పూర్తిగా పునఃసమీక్షించి, అనర్హులకు ఇచ్చిన ఉద్యోగాలను రద్దు చేసి అర్హులైన అభ్యర్థులకు అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. స్పోర్ట్స్ సర్టిఫికెట్ల పేరుతో పరీక్షలు, ఇంటర్వ్యూలు లేకుండానే నియామకాలకు అవకాశం కల్పిస్తూ అవినీతి జరిగిందని ఆరోపిస్తూ, ఈ వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరగాలని కోరారు. 

-  పాత‌ప‌ట్నం..

శ్రీకాకుళం, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో శ్రీకాకుళం జిల్లా పాతపట్నం నియోజకవర్గంలోని మెలియాపుట్టిలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.

వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా రాష్ట్ర క్రమశిక్షణా కమిటీ సభ్యురాలు, మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి నాయకత్వంలో స్థానిక వైఎస్సార్ విగ్రహం వద్ద ఈ దీక్ష చేపట్టారు.

ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. నిరుద్యోగ యువతకు న్యాయం జరిగే వరకు వైఎస్సార్‌సీపీ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు.

ఈ రిలే నిరాహార దీక్షలో పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, యువజన విభాగం ప్రతినిధులు, విద్యార్థులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.

-  గజపతినగరంలో 

డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గంలో 'ఏపీ జెన్-జీ వార్' కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు కొనసాగాయి.
వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు గజపతినగరం ప్రధాన రహదారిలోని వినాయకుడి ఆలయం సమీపంలో ఈ దీక్షలు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య, యువనేత బొత్స సాయి గురునాయుడు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గురువారం షెడ్యూల్ ప్రకారం దత్తిరాజేరు, జామి మండలాలకు చెందిన పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ రిలే నిరాహార దీక్షలో దత్తిరాజేరు, జామి మండలాలకు చెందిన ఎంపీపీలు, జెడ్పీటీసీలు, గ్రామ పార్టీ అధ్యక్షులు, యువజన విభాగం, సోషల్ మీడియా విభాగం, విద్యార్థి విభాగం అధ్యక్షులు, వివిధ అనుబంధ విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఆగస్టు 7న బొండపల్లి మండలం, ఆగస్టు 8న గంట్యాడ మండలం, ఆగస్టు 9న గజపతినగరం మండలానికి చెందిన పార్టీ శ్రేణులతో రిలే నిరాహార దీక్షలు కొనసాగనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.

- మడకశిరలో 

డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా మడకశిర నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు నియోజకవర్గ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో మడకశిర కేంద్రంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం, యువజన విభాగం నాయకులు, సభ్యులు రిలే నిరాహార దీక్షలో పాల్గొని డీఎస్సీ నియామకాలపై నిరసన వ్యక్తం చేశారు. 

- రైల్వే కోడూరులో 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రైల్వే కోడూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు రైల్వే కోడూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు దీక్షలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- తాడిపత్రిలో 
అనంతపురం, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తాడిపత్రి నియోజకవర్గంలోని యాడికిలో మండల స్థాయి రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. తాడిపత్రి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఆదేశాల మేరకు యాడికి బస్టాండ్ సమీపంలోని మహాత్మా గాంధీ విగ్రహం ప్రాంగణంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- కల్లూరులో 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లా కల్లూరు అర్బన్‌లోని చెన్నమ్మ సర్కిల్ వద్ద నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షకు నంద్యాల జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి సంఘీభావం తెలిపారు.  ఈ కార్యక్రమంలో పాణ్యం నియోజకవర్గ అబ్జర్వర్ గుండం సూర్యప్రకాశ్ రెడ్డి, డీఎస్సీ అభ్యర్థులు, యువజన, విద్యార్థి విభాగం నాయకులు, మాజీ కార్పొరేటర్లు, కల్లూరు మండల నాయకులు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- ఉంగుటూరులో 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఉంగుటూరు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఉంగుటూరు నియోజకవర్గ పీఏసీ సభ్యుడు, నియోజకవర్గ ఇన్‌చార్జి పుప్పాల వాసు బాబు ఆధ్వర్యంలో ఉంగుటూరులో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, యువజన, విద్యార్థి విభాగాల ప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పుప్పాల వాసు బాబు మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి సంతకంగా మెగా డీఎస్సీ నిర్వహిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు నాయుడు ప్రభుత్వం చివరికి "దగా డీఎస్సీ"గా మార్చి నిరుద్యోగ యువత జీవితాలతో చెలగాటమాడిందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో తలెత్తిన ఆరోపణలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
 
-  జగ్గంపేటలో 
 డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కాకినాడ జిల్లా జగ్గంపేట నియోజకవర్గంలో 'ఏపీ జెన్-జీ వార్' కార్యక్రమంలో భాగంగా రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు జగ్గంపేట టౌన్‌లోని స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం వద్ద ఆగస్టు 6 నుంచి 9 వరకు నాలుగు రోజులపాటు ఈ రిలే నిరాహార దీక్షలు నిర్వహిస్తున్నారు. జగ్గంపేట నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి, మాజీ ఎంపీ తోట నరసింహం, రాష్ట్ర వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ తోట శ్రీ రాంజీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ప్రారంభమైంది. 

-  కొవ్వూరులో 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో కొవ్వూరు బస్టాండ్ సెంటర్‌లో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు కొవ్వూరు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్‌చార్జి తలారి వెంకట్రావు ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమం చేపట్టారు. డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- అమలాపురంలో  

అంబేద్కర్ కోనసీమ, ఆగస్టు 6: డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయడంతో పాటు ఇచ్చిన హామీ మేరకు నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో అమలాపురంలో రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు మాజీ మంత్రి, పీఏసీ సభ్యుడు, పార్లమెంట్ ఇన్‌చార్జి పినిపే విశ్వరూప్, అమలాపురం అసెంబ్లీ ఇన్‌చార్జి డాక్టర్ పినిపే శ్రీకాంత్ ఆధ్వర్యంలో ఈ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ పినిపే శ్రీకాంత్ మాట్లాడుతూ, విద్యార్థులు, యువతను నమ్మించి వారి భవిష్యత్తుతో రాజకీయాలు చేయడం అత్యంత దురదృష్టకరమన్నారు. డీఎస్సీ నియామకాలపై వచ్చిన ఆరోపణలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుడుపూడి సూర్యనారాయణరావు, బొమ్మి ఇజ్రాయేల్, రాష్ట్ర కార్యదర్శులు చెల్లుబోయిన శ్రీనివాసరావు, వంటెద్దు వెంకన్నాయుడు, త్రినాథ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు సంసాని నాని, వివిధ మండల అధ్యక్షులు, ప్రజాప్రతినిధులు, రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, రైతు, బీసీ, ఎస్సీ, మైనార్టీ, విద్యార్థి విభాగాల ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

- వేమూరు నియోజ‌క‌వ‌ర్గంలో  
 డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని అమృతలూరులో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్రవ్యాప్త పిలుపు మేరకు నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో వేమూరు నియోజకవర్గ సమన్వయకర్త, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వరికూటి అశోక్ బాబు పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 
ఈ సందర్భంగా పేకాట (బ్రిడ్జ్) ఆటను ప్రతీకాత్మకంగా ప్రదర్శిస్తూ వినూత్న రీతిలో నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వరికూటి అశోక్ బాబు మాట్లాడుతూ, మెగా డీఎస్సీలో బ్రిడ్జ్ ఆటలను చేర్చి అభ్యర్థుల భవిష్యత్తుతో చెలగాటమాడారని విమర్శించారు. అర్హత కంటే అక్రమాలకే ప్రాధాన్యం ఇచ్చారనే అనుమానాలు రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు. 

-  హిందూపురంలో  
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలోని బీపీఎల్ సర్కిల్‌లో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. 
వైఎస్సార్‌సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో విద్యార్థి, యువజన విభాగాల నాయకులు, పార్టీ కార్యకర్తలు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- చిత్తూరులో  
 డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలు, అవకతవకలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజకీయ, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు పాత బస్టాండ్ ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తొలి రోజు రిలే నిరాహార దీక్ష ప్రారంభమైంది. 
వైఎస్సార్‌సీపీ చిత్తూరు నియోజకవర్గ ఇన్‌చార్జి ఎంసీ విజయానందరెడ్డి ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ నిరసన కార్యక్రమంలో యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- మాచర్లలో  
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ పల్నాడు జిల్లా మాచర్లలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. 
ఈ దీక్షలకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంఘీభావం తెలియజేసి పాల్గొన్నారు. డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి నిరసన వ్యక్తం చేశారు. 
ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం నిర్వహించింది మెగా డీఎస్సీ కాదని, "మెగా కుంభకోణం" అని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. 

- కనిగిరిలో ఉద్రిక్తత 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై నిరసనగా మార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన ఆందోళన కార్యక్రమం ఉద్రిక్తతకు దారితీసింది. పామూరు బస్టాండ్ వద్ద నిర్వహించిన ధర్నాలో పాల్గొన్న వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి దద్దాల నారాయణ యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు పెద్ద సంఖ్యలో ధర్నాలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిరసనను అడ్డుకున్న పోలీసులు దద్దాల నారాయణ యాదవ్‌ను బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 
దీనిని తీవ్రంగా నిరసించిన వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అక్రమ అరెస్టులను ఖండిస్తూ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి, స్టేషన్ ఎదుట బైఠాయించి ప్రభుత్వం, పోలీసుల వైఖరికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ నాయకుల పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారని, పలువురిని చొక్కాలు పట్టుకుని ఈడ్చుకెళ్లారని వైఎస్సార్‌సీపీ నాయకులు ఆరోపించారు. ప్రజాస్వామ్యబద్ధంగా నిర్వహిస్తున్న నిరసనలను అణచివేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోందని విమర్శించారు. 

- ఉరవకొండలో  
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా ఉరవకొండలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు చేపట్టి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. 

- మడకశిరలో 
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర పట్టణంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త ఈర లక్కప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ విద్యార్థి విభాగం నాయకులు, యువజన ప్రతినిధులు, పార్టీ శ్రేణులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- గుంతకల్లులో 
 డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలను నిరసిస్తూ అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపల్ కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ విద్యార్థి, యువజన విభాగాల ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించి రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు నైరుతి రెడ్డి పాల్గొని డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, యువజన నాయకులు, పార్టీ కార్యకర్తలతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- అనంత‌పురం ఎస్కేయూ వద్ద  
డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం (ఎస్కేయూ) ప్రధాన ద్వారం వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 
ఈ సందర్భంగా తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ, డీఎస్సీ–2025 నియామకాలపై వెలువడుతున్న ఆరోపణలు రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగ యువతలో తీవ్ర ఆందోళనకు కారణమయ్యాయని అన్నారు. నియామక ప్రక్రియపై నిష్పాక్షికంగా సీబీఐ దర్యాప్తు చేపట్టి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావాలని, అక్రమాలకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 

- నార్పలలో  
 డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ అనంతపురం జిల్లా నార్పల మండల కేంద్రంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. 
ఈ నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి, నియోజకవర్గ సమన్వయకర్త డా. సాకే శైలజానాథ్ పాల్గొని పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 
ఈ సందర్భంగా డా. సాకే శైలజానాథ్ మాట్లాడుతూ, డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సమగ్ర, నిష్పాక్షిక సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని కోరారు. 

- కర్నూలులో  
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కర్నూలు నగరంలోని ధర్నా చౌక్ వద్ద వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కర్నూలు మాజీ మేయర్ బి.వై. రామయ్య, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి సీట్రా సత్యనారాయణమ్మ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రామకృష్ణతో పాటు పార్టీ నాయకులు, కార్యకర్తలు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 

- బంగారుపాలెంలో ..
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ చిత్తూరు జిల్లా బంగారుపాలెంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. పూతలపట్టు నియోజకవర్గ ఇన్‌చార్జి డాక్టర్ సునీల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమంలో పార్టీ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు.
 
- శ్రీకాళహస్తిలో  ..
డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్‌సీపీ శ్రీకాళహస్తి నియోజకవర్గ ఇన్‌చార్జి బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ నిరసన కార్యక్రమంలో డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. 

- స‌త్య‌వేడులో..
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని నాగలాపురం మండలంలో వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో ఉమ్మడి చిత్తూరు జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు కరుణాకర్ రెడ్డి, సత్యవేడు నియోజకవర్గ ఇన్‌చార్జి నూకతోట రాజేష్ పాల్గొని డీఎస్సీ అభ్యర్థులు, విద్యార్థులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, మెగా డీఎస్సీ పేరుతో చదువుకున్న విద్యార్థుల భవిష్యత్తుతో ప్రభుత్వం చెలగాటమాడిందని విమర్శించారు. డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసే వరకు వైఎస్సార్‌సీపీ ఉద్యమం కొనసాగుతుందని స్పష్టం చేశారు. 

- సంతనూతలపాడులో ..
డీఎస్సీ నియామకాల్లో జరిగినట్లు ఆరోపణలు వస్తున్న అక్రమాలపై సమగ్ర సీబీఐ విచారణ జరిపించాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ నైతిక బాధ్యత వహిస్తూ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా సంతనూతలపాడు గ్రామంలోని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో సంతనూతలపాడు నియోజకవర్గ వైఎస్సార్‌సీపీ ఇన్‌చార్జి, మాజీ మంత్రి మెరుగు నాగార్జున పాల్గొని పార్టీ నాయకులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువతతో కలిసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్ దుంప చెంచిరెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు దుంప రమణమ్మ, పార్టీ నాయకులు, కార్యకర్తలు, వివిధ అనుబంధ విభాగాల ప్రతినిధులు, డీఎస్సీ అభ్యర్థులు, నిరుద్యోగ యువత పెద్ద సంఖ్యలో పాల్గొని ఉద్యమానికి సంఘీభావం తెలిపారు.

 

Back to Top