తాడేపల్లి: ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డిపై చంద్రబాబు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, ఆయన మూతికి అట్లకాడ కాల్చి వాత పెట్టాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి, ఎమ్మెల్యే అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. చంద్రబాబు విచిత్రమైన మానసిక స్థితిలో ఉన్నారని విమర్శించారు. పంచాయితీలు చేసి పైకి వచ్చారని, తన సహచరులు పార్టీని వీడుతుంటే వైయస్ జగన్పై అర్థంపర్థం లేని ఆరోపణలు చేస్తూ అభాసుపాలవుతున్నారని దుయ్యబట్టారు. తాడేపల్లిలోని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఓటమిపాలైన వారు ప్రతిపక్షంలో ఉండటం..ప్రతిపక్షంలో ఉన్నవారు గెలిచి అధికారంలోకి రావడం సర్వసాధారణమన్నారు. మొన్న జరిగిన ఎన్నికల్లో కూడా కేంద్రంలో మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కొన్ని రాష్ట్రాల్లో అధికారపార్టీలను తిరిగి ఎన్నుకున్నారు. ఏపీలో మాత్రం టీడీపీని ఘోరంగా ఓడించి, కేవలం 23 సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు. అనుభవం ఉన్న చంద్రబాబును ప్రజలు మూలన కూర్చోబెట్టారు. తాను తప్పు చేశానన్న వాస్తవాన్ని గమనించలేక, ప్రజలు తప్పు చేశారని వింత దోరణితో మాట్లాడుతున్నారు. చాలా చోట్లకు వెళ్లి నన్ను ఓడించండి తప్పు చేశారని అంటున్నారు. తాను పాలించే ఆవునని చెప్పుకుంటున్న చంద్రబాబు..ఎందుకు ఓడిపోయారో ఆత్మవిమర్శ చేసుకోకపోతే టీడీపీకి అసలు మనుగడే ఉండదన్నారు. నాలుగు నెలల పాటు ఆయనకు పదవి లేకపోయే సరికి, తన పార్టీని వదిలి నాయకులు వదలిపెడుతుంటే చంద్రబాబు తట్టుకోలేకపోతున్నారు. క్షణం తీరిక లేకుండా ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారు. రాష్ట్రంలో పదేళ్లు కష్టపడి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. వైయస్ జగన్ ముఖ్యమంత్రిగా 151 సీట్లతో అధికారంలోకి వచ్చారు. అలాంటి వ్యక్తిని చంద్రబాబు రౌడీ ముఖ్యమంత్రి, నేరస్తుడు అని అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమన్నారు. వైయస్ జగన్పై నేరారోపణలు చేయబడ్డాయి. అవి విచారణలో ఉన్నాయి. అలాంటి వ్యక్తిని నేరస్తుడు అని ఎలా మాట్లాడుతున్నారు. బుద్ధి, జ్ఞానం లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు. చంద్రబాబు గతంలో ప్రతిపక్షంలో ఉండి గట్టిగా అరిస్తే..మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి భయపడేవారట..నేనైతే ఎప్పుడు అలాంటి పరిస్థితి లేదు. చంద్రబాబు ఎక్కడికెళ్తే అక్కడ పులివెందుల పంచాయితీ అంటున్నారు. వైయస్ జగన్, వైయస్ రాజశేఖరరెడ్డి ఎప్పుడైనా పంచాయితీలు చేశారా? ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డిలతో ఐఏఎస్ ఆఫీసర్ను కూర్చోబెట్టి ఫిప్టీ ఫిప్టీ అని పంచిపెట్టింది ఎవరూ? విశాఖ ల్యాండ్ స్కామ్లో అయ్యాన్నపాత్రుడు, గంటాల మధ్య పంచాయితీ చేసింది నీవు కాదా? చింతమనేని ప్రభాకర్ పంచాయితీ చేసింది నీవు కాదా? ట్రాన్స్పోర్టు కమిషనర్ బాలసుబ్రహ్మణ్యం విషయంలో పంచాయితీ చేసింది నీవు కాదా ? పంచాయితీలు చేసే లక్షణం చంద్రబాబుకే ఉంది. పులివెందుల పంచాయితీ కాదు..పౌరుషానికి నిదర్శనమైన ప్రాంతమది. ఇద్దరు ముఖ్యమంత్రులను ఇచ్చిన ప్రాంతమది. పులివెందుల పంచాయితీ అంటే ఊరుకోకండి. అట్ల కర్ర కాల్చి చంద్రబాబు మూతిపై వాత పెట్టాలని కోరుతున్నా. కరకట్ట పంచాయితీ అంటున్నావు. ఆ ఇల్లు నీదా? వైయస్ జగన్ సీఎం అయిన తరువాత ఆ ఇల్లు నాది అంటున్నావు..నీవు అధికారంలో ఉన్నప్పుడు మాత్రం లింగమనేని గెస్ట్ హౌస్ అన్నావు. చంద్రబాబు ఇంకా ఫ్రెస్టేషన్లో ఉన్నారు. చింతమనేని ప్రభాకర్ వ్యవహారంలో నీవు ఎలా ప్రవర్తించావు. ఇవాళ మా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిపై ఎంపీడీవో సరళామ్మ ఓ ఆరోపణ చేశారు. చింతమనేని -వనజాక్షి వ్యవహారంలో నీవు ఎలా వ్యవహరించావు? కోటంరెడ్డి- సరళమ్మ వ్యవహారంలో సీఎం వైయస్ జగన్ ఎలా వ్యవహరించారో గమనించాలి. అసెంబ్లీ నుంచి చైర్స్ ఎత్తుకెళ్తే కోడెల కుమారుడికి ఎందుకు బెయిల్ వచ్చింది? ఆరోపణ చేయబడిన వ్యక్తిని కస్టడిలోకి తీసుకోవడం, బెయిల్ ఇవ్వడం సర్వసాధారణం. సీఎం వైయస్ జగన్ చట్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. వైయస్ జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా వైయస్ఆర్ కంటి వెలుగు పథకాన్ని అమలు చేస్తుంటే..చంద్రబాబు ఈ పథకాన్ని ఎప్పుడో ప్రారంభించారట. గ్రామ సచివాలయాలను కూడా ఈయనే ప్రారంభించారట. కాగితాలపై పెట్టి డబ్బులు గుంజి ఉంటారు. ప్రజా సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వంపై చంద్రబాబు ఊరికే దూషించడం అలవాటుగా పెట్టుకున్నారు. బెల్టుషాపులు రద్దు చేసిన ఘనత మా ప్రభుత్వానిది. గాంధీ జయంతి రోజున మద్యం అమ్మారని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు, మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించిన చారిత్రాత్మక ప్రభుత్వం ఇది. వైయస్ జగన్కు ఐదేళ్లు పాలించే బలాన్ని ప్రజలు ఇచ్చారు. సీఎం చిత్తశుద్ధితో ముందుకు వెళ్తున్నారు. మీరు చేసే విమర్శల్లో పస లేదు. మీ మాటలకు వైయస్ జగన్ స్పందించాల్సిన అవసరం లేదు. ఆ స్థాయిలో చంద్రబాబు లేరన్న నగ్న సత్యాన్ని గ్రహించాలి. ఒక చక్కని, సుపరిపాలన వైయస్ జగన్ అందిస్తున్నారు. ఇప్పటికైనా చంద్రబాబు తీరు మార్చుకోవాలి.