మీ డ్రీమ్స్ను నా స్కీమ్స్తో నెరవేర్చాను ఉమ్మడి విజయనగరం జిల్లాలో తొమ్మిదికి 9 సీట్లు కానుకగా ఇస్తాంరేపటితో ముగియనున్న ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర వైయస్.జగన్ ను కలిసిన విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమిత నాయకులుసోషల్ మీడియా కార్యకర్తల్లో నూతనోత్సాహందాడులకు భయపడేది లేదు విజయనగరం జిల్లాలోకి ప్రవేశించిన సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రదాడులకు భయపడేది లేదు బీజేపీ, టీడీపీ, జనసేన కీలక నేతలు వైయస్ఆర్సీపీలో చేరికసీఎం వైయస్ జగన్కు ఉత్తరాంధ్ర సాంప్రదాయ నృత్యాలతో ఘన స్వాగతం
బాసు 18 కేసుల్లో స్టేతో పత్తిగింజని అంటున్నాడు
09 Sep 2019 10:44 AM
ఎంపీ విజయసాయిరెడ్డి ట్వీట్
అమరావతి: తెలుగుదేశం అధినేత చంద్రబాబు, ఇతర టీడీపీ నేతలపై వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి తీవ్రంగా విరుచుకుపడ్డారు. బాసు ఏమో 18 కేసుల్లో స్టేలు తెచ్చుకుని తాను పత్తిగింజనని చెప్పుకుంటాడని విజయసాయిరెడ్డి విమర్శించారు. ఆయన బానిసలు ఏమో పోలీసులకు కూడా దొరక్కుండా తప్పించుకుని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
పేదలకు నాణ్యమైన బియ్యం సరఫరా చేస్తే ఇలాంటి వాళ్లు జీర్ణించుకోలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మూడుపుటలా ఇసుక బొక్కినవాళ్లకు రేషన్ బియ్యం నాణ్యత ఏం తెలుస్తుందని చురకలు అంటించారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.