విజయవాడ: ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో స్వరాజ్ మైదానం దగ్గర ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద జమ్ముకశ్మీర్లో వీరమరణం పొందిన జవాన్ మురళి నాయక్కు ఘనంగా నివాళులర్పించారు. కృష్ణా జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ , మాజీ ఎమ్మెల్యే లు వేలంపల్లి శ్రీనివాస్ , మల్లాది విష్ణు , మేయర్ రాయన భాగ్యలక్ష్మి , డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు , వైయస్ఆర్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు మురళి నాయక్ చిత్ర పటానికి పూలమాలలు వేసి కోవొత్తులతో శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు మాట్లాడారు. వారు ఏమన్నారంటే.. ఎన్టీఆర్ జిల్లా వైయస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ దేశం కోసం ప్రాణం విడిచిన మురళి కుటుంబానికి వైయస్ఆర్సీపీ అండగా ఉంటుంది వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఈనెల 13వ తేదీ మురళీ కుటుంబాన్ని పరామర్శిస్తారు భారత ఆర్మీ, నేవీ,డిఫెన్స్ కు దేశపౌరులుగా మేం అండగా ఉంటాం కూటమి ప్రభుత్వం ఇప్పుడు కూడా కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది అనుమతులు లేకుండా వైసీపీ నేతల ఇంట్లో సోదాలు చేయటం దారుణం మాజీమంత్రి విడదల రజిని మీద దాడి దుర్మార్గం చంద్రబాబు ఇప్పటి వరకు చేసిందేమీ లేదు మాజీ ఎమ్మెల్యే, వెలంపల్లి శ్రీనివాస్ భారత సైన్యంలో ముఖ్య పాత్ర పోషించి ప్రాణాలు అర్పించిన వ్యక్తి మురళి నాయక్ పాకిస్థాన్ ని సమర్ధవంతంగా మన ఆర్మీ ఎదుర్కొంది వాళ్ళ ప్రాణత్యాగం వలనే మనం ఈ విధంగా ఉన్నాం ప్రభుత్వం ఇప్పటి వరకూ మురళి కుటుంబానికి ఆర్థిక సహాయం కూడా చేయలేదు ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది విడదల రజిని మీద దౌర్జన్యం చేయడం దారుణం ఆంధ్రాలో పాలన ఎటు పోతుంది రాష్ట్రంలో ఈ విధమైన పాలన దురదృష్టకరం మాజీ ఎమ్మెల్యే , మల్లాది విష్ణు మురళి నాయక్ కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాం యుద్ధంలో అనేక మంది జవాన్లు కష్టపడ్డారు,కొంతమంది ప్రాణాలు కోల్పోయారు ఈ యుద్ధంలో భారత్ విజయం సాధించింది వైయస్ జగన్ మోహన్ రెడ్డి ... మురళి నాయక్ కుటుంబానికి అండగా నిలుస్తున్నారు ఈ వార్త తెలుసుకున్న కొంతమంది నేతలు ఇప్పుడు బయలుదేరి వెళ్తున్నారు ఇలాంటి పరిస్థితుల్లో కూడా కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు దిగుతుంది మాజీమంత్రి రజిని పై దాడి హేయమన చర్య హై కోర్టు ఎన్నిసార్లు అక్షింతలు వేసినా ప్రభుత్వానికి బుద్ధి రావటం లేదు రాష్ట్రంలో పోలీస్ రాజ్యం నడుస్తోంది...దీనికి పుల్ స్టాప్ పెట్టాలి