వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
ఏపీ దేశంలోనే నంబర్ వన్ కాబోతోంది
30 May 2019 11:11 AM
ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్
అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వైయస్ జగన్ సారధ్యంలో దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉంటుందని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ అన్నారు. విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ రోజు దేశం మొత్తం ఏపీ వైపు చూస్తుందన్నారు. 42 ఏళ్ల వయసు వ్యక్తి పార్టీ పెట్టి ఈ స్థాయిలో ఘన విజయం సాధించడం చరిత్రలో ఇదే మొదటి సారి అన్నారు. పేదల దేవుడు వైయస్ రాజశేఖరరెడ్డి అని, ఆయన పాలన మళ్లీ వైయస్ జగన్ తీసుకురాబోతున్నారు. ప్రతి పేదవాడు సంతోషంగా ఉండేలా పరిపాలన సాగబోతుందన్నారు. ఈ ఎన్నికల్లో ఫ్యాన్ సునామి సృష్టించిందన్నారు. ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్గా తీర్చిదిద్దుతారని విశ్వాసం వ్యక్తం చేశారు.