19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలు
చంద్రబాబు బుద్ధి మార్చుకోవాలి
21 Oct 2021 12:50 PM
పార్వతీపురం జనాగ్రహ దీక్షలో ఎమ్మెల్యే అలజంగి జోగారావు
విజయనగరం: చంద్రబాబు తన బుద్ధి మార్చుకోవాలని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే అలజంగి జోగారావు అన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నేతలు చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా పార్వతీపురం నియోజకవర్గంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఆధ్వర్యంలో జనాగ్రహ దీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున దీక్షలో పాల్గొన్నారు. చంద్రబాబు, టీడీపీ నాయకులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. చంద్రబాబు తీరు మార్చుకోవాలని కోరుతూ నిరసన వ్యక్తంచేసి రాజ్యాంగాన్ని పరిరక్షించాలని అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో పట్టణ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్, మూడు మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు మరియు ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.