విశాఖ: చంద్రబాబు పాలనలో ప్రజలు విసిగిపోయారని వైయస్ఆర్సీపీ నేత దాడి వీరభద్రరావు విమర్శించారు. చంద్రబాబు చుట్టూ ఉన్న వారంతా క్రిమినల్సే అని ఫైర్ అ య్యారు. చంద్రబాబు, లోకేష్లు గజినీ, ఘోరీలా మారి దోచేస్తున్నారని మండిపడ్డారు. దేశంలో అత్యంత ధనిక సీఎం చంద్రబాబే అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి చంద్రబాబు బద్ధవిరోధి అని ధ్వజమెత్తారు. కమీషన్ల కోసం కక్కుర్తి పడుతున్నారే తప్ప..చంద్రబాబుకు పోలవరం నిర్మించాలని లేదన్నారు.