తాడేపల్లి: ఇంటింటికి అందుతున్న పింఛన్లను అడ్డుకుని..ఇప్పుడు చంద్రబాబు మొసలి కన్నీరు కార్చుతున్నారని వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి మండిపడ్డారు. పింఛన్ల పంపిణీపై చంద్రబాబు తీరును సజ్జల రామకృష్ణారెడ్డి తీవ్రంగా తప్పుపట్టారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. సజ్జల రామకృష్ణారెడ్డి ఏమన్నారంటే.. *నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన జగన్ గారిపై అభిమానం తగ్గుతుందా?:* – వృద్ధులు, వికలాంగులకు నాలుగున్నరేళ్లుగా వాలంటీర్ వ్యవస్థ ఇళ్ల వద్దే పింఛన్లు పంపిణీ చేస్తోంది. – చంద్రబాబు తన బినామీలతో వాలంటీర్లు వైఎస్సార్సీపీకి ప్రచారం చేస్తారనే సాకు చూపి వాళ్లను పక్కన పెట్టడానికి తానే కారణం అయ్యాడు. – ఏప్రిల్1న ఇవ్వాల్సిన పింఛన్ కొత్త ఏడాది అయినందువల్ల 3వ తేదీ ఇస్తే దాన్నీ కూడా యాగీ చేశాడు. – దానికి ఆయన చెప్పిన కారణం వాలంటీర్లు వైఎస్సార్సీపీ ఏజెంట్లుగా పనిచేస్తున్నారు అంటున్నారు. – ఏ ప్రభుత్వమైనా మంచి చేస్తుంటే పార్ట్ టైమర్స్ అయినా సరే..వారిపై ప్రజల్లో అభిమానం ఉండొచ్చు. – ఈ ఎన్నికల నెలలో వాళ్లెళ్లి ఇచ్చినంత మాత్రానా ప్రభావితం చేస్తారని అనుకోవడం పొరపాటని ఆనాడే చెప్పాం. – 2.60లక్షల మంది వాలంటీర్లు అనేకమైన సేవలు అందిస్తున్నారు. వాటిలో పింఛన్లు పంపిణీ చేయడం ఒకటి. – ఎప్పటికప్పుడు వారికి భరోసా ఇస్తూ పథకాలు లేకపోతే వాలంటీర్లకు ఆదరణ ఎందుకుంటుంది? – అల్టిమేట్గా అది వాలంటీర్ల వల్ల కాదు..వారు అందుకుంటున్న బెన్ఫిట్ ఎవరిస్తున్నారో వాళ్లకి బ్లెస్సింగ్స్ ఇస్తారు. అది వాలంటీర్ల వస్తుందని కాదు.. – నువ్వు ఒక నెల ఆపినంత మాత్రాన జగన్ గారిపై అభిమానం తగ్గుతుందా? – నువ్వు చెప్తే నిన్ను ఎక్కడ వెంటపడి కొడతారో అనే భయంతో ఒక బినామీ సంస్థతో ఆ వ్యవస్థను ఆపించాడు. – సుప్రీం కోర్టుకు వెళ్లారు..ఎన్నికల కమిషన్పై వత్తిడి చేశారు. చివరికి వారు అనుకున్నది సాధించారు. *అసలు ఎలా పంచాలో చెప్పడానికి చంద్రబాబు ఎవరు?:* – ఎన్నికల కమిషన్ ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయమన్నది. దానిలో భాగంగా ప్రభుత్వ యంత్రాంగం వీలైనంత త్వరగా పింఛన్ అందించడానికి ప్రయత్నం చేసింది. – రాగలిగిన వాళ్లను సచివాలయాలకు రమ్మని చెప్పింది. రాలేని వాళ్లకు ఇళ్లకు వెళ్లి పంపిణీ చేసింది. – సాధారణంగా వాలంటీర్లు ఉంటే ఒకరోజులోనే 90 శాతం అయ్యేది ఆ వ్యవస్థ లేదు కాబట్టి రెండు మూడు రోజులు పట్టింది. – దీన్ని చూసి ఆ వ్యతిరేకత అంతా తనమీదకు వస్తుందనే భయంతో సచివాలయ సిబ్బంది 1.20లక్షల మందితో పింఛన్ పంపిణీ చేయాలని కొత్త రాగం అందుకున్నాడు. – అప్పటి వరకూ రాష్ట్రంలో ఉద్యోగులే లేరన్న చంద్రబాబు..జగన్ గారు పెట్టిన 1.20లక్షల మంది ఉద్యోగులున్నారని ఒప్పుకున్నాడు. – అసలు ఎవరీయన? ఈయనేమన్నా ప్రభుత్వంలో ఉన్నాడా? – ఓ పక్క ఉన్న వ్యవస్థనూ నువ్వే దెబ్బ తీస్తావ్..మరో వైపు దానికి బదులు ప్రభుత్వం ఏం చేయాలో కూడా నువ్వే చెప్తావ్? – నువ్వు చెప్పింది చేయకపోతే నేను ఒప్పుకోను అంటాడు. *చంద్రబాబు ఎన్నికల కమిషన్ను తన మీడియాతో బ్లాక్మెయిల్ చేస్తున్నాడు:* – తనకు ఏం అధికారం ఉందని రోజు ఏదో ఒకటి చెప్పడం, ఎన్నికల కమిషన్పై వత్తడి పెట్టడం చేస్తున్నాడు. – చివరికి ఆయన బ్లాక్ మెయిల్ ఎంతవరకూ వెళ్తోందంటే ఉన్మాదంతో తన మీడియాలో అడ్డంగా అధికారులపై రాతలు రాయిస్తున్నాడు. – చంద్రబాబు ఇప్పుడే కాదు..2019లోనూ సీఈవోపై దాడికే వెళ్లాడు. ఇప్పుడూ అదే చేస్తున్నాడు. – నువ్వు బ్రేక్ చేసినా ప్రభుత్వం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసింది. సచివాలయ సిబ్బంది ఉదయం 7 నుంచి రాత్రి 7 వరకూ కూర్చుని మూడు రోజుల్లో పంచేశారు. – ప్రభుత్వం పని ప్రభుత్వాన్ని చేసుకోనిస్తే రెండు మూడు రోజుల్లో పూర్తవుతుంది. నువ్వు ప్రత్యేకంగా చెప్పాల్సిన పనేముంది? – చంద్రబాబు భయం ఏంటంటే..అతని వల్లే వృద్ధులు రోడ్డెక్కాల్సి వచ్చింది..ఆ కోపమంతా తనపై చూపిస్తారని వణికిపోయాడు. – దీంతో నేను ఒప్పుకోను...ఇంటికి తీసుకెళ్లే ఇవ్వాలంటూ పిటిషన్లపై పిటిషన్లు పెట్టాడు. – లేదంటే ఆ 32 మందిని నువ్వే చంపినట్లవుతుంది అని బూతులు తిట్టాడు. – శవరాజకీయం చేస్తున్నాం అంటూ మాట్లాడుతున్నాడు. అసలు శవ రాజకీయం చేస్తున్నది చంద్రబాబు కాదా? *ఈ పాపం నీది కాదా చంద్రబాబూ..అసలు నువ్వు మనిషి జన్మ ఎత్తావా?:* – ఈ రోజు ఈసీ నుంచి విస్పష్టమైన ఆదేశాలు వచ్చాయి. దీనికి డీబీటీ వేస్తే నేను ఒప్పుకోను అంటూ మాట్లాడుతున్నాడు. – డీబీటీ ద్వారా వేయండి అని ఈసీ ఈ రోజే కాదు..ఏప్రిల్ మాసం ప్రారంభంలోనూ చెప్పింది. – మార్చి 30వ తేదీన ఈసీ ఇచ్చిన ఆదేశాల్లోనే డీబీటీ అన్నారు. ఈ సారి రాసిన లెటర్లో కూడా అదే చెప్పారు. – మళ్లీ చంద్రబాబు గ్యాంగ్ మొత్తం గవర్నర్ను కలిసి, ఢిల్లీలో కూర్చున్న ఈయన ఏజెంట్లు ఎన్నికల కమిషన్పై వత్తడి తెస్తున్నారు. – ఇక్కడ సీఈవో ఎవరి చేతిలో ఉన్నాడంటూ వరుసపెట్టి కథనాలు రాయించాడు. – వాళ్లను బ్లాక్మెయిల్ చేసి, వత్తడి చేసి మళ్లీ లెటర్ రాయించారు. – ఆ ఆదేశాలకు మేరకే ఈ రోజు ప్రభుత్వం డీబీటీ ద్వారా అవకాశం ఉన్న వారికి బ్యాంకులో వేస్తోంది. లేని వారికి ఇళ్ల వద్దకు వెళ్లి ఇస్తోంది. – ఇందులో తప్పు ఎవరిది? ఈ పాపం ఎవరిది? చంద్రబాబుది కాదా? – నువ్వు తిట్టే తిట్లు చూస్తుంటే అసలు నువ్వు మనిషివేనా అనిపిస్తోంది. అసలు నువ్వు మనిషి జన్మ ఎలా ఎత్తావని అనిపిస్తోంది. – చంద్రబాబు తన ప్రసంగం అరగంట సాగితే 27 నిమిషాలు తిట్లే ఉంటాయి. – భూమికి భారం అంటాడు..తల్లికి భారం అంటాడు. ఇలాంటి మాటలు మాట్లాడుతున్న చంద్రబాబును చూసి తన తండ్రి కూడా సిగ్గుపడి ఉంటాడు. – ఏవైతే తనకున్న లక్షణాలను తీసుకొచ్చి జగన్ గారికి ఆపాదిస్తున్నాడు. – సంధి ప్రేలాపనలతో ఏదంటే అది మాట్లాడతాడు. – మొన్న ఏకంగా జగన్ గారిని చంపితే ఏమవుతుంది అంటున్నాడు. *2014–19 మధ్య నువ్వు చేసిన పింఛన్ల పంపిణీ ప్రజలు మర్చిపోయారనుకుంటున్నావా బాబూ?:* – నీకు చేతకాకపోతే తప్పుకో..ఒక నిమిషంలో నేను డిస్ట్రిబ్యూషన్ చేసి చూపిస్తా అంటాడు. – నిజంగానే ఆయన తలకాయలో చిప్ జారిపోయింది. 2014–19 మధ్య నువ్వు చేసింది జనం మర్చిపోయి ఉంటారనుకుంటున్నారా? – ఇన్ని మాట్లాడుతున్న చంద్రబాబు ఏం చేశాడా అని ఆరా తీస్తే వృద్ధులు, వికలాంగులంతా క్యూలు కట్టి పింఛన్ల కోసం నానా అగచాట్లు పడ్డారు. – ఒక సారి ఆయన పింఛన్ల పంపిణీ ఎలా సాగిందో మచ్చుకు చీరాలలో చూద్దామా? – వృద్ధులు, వికలాంగులు, సుగర్, బీపీలు ఉన్న వాళ్లు ఎండలో నిలబడి నానా అగచాట్లు పడ్డారని లబ్ధిదారులే చెప్తున్నారు. – ఇలాంటి చంద్రబాబు హయాంలో పింఛన్ల పంపిణీ సందర్భంగా ప్రతి గ్రామంలో కనిపించే సాధారణ దృశ్యాలు. – రాష్ట్రమంతా దీనికి సాక్ష్యం. పింఛన్ వస్తుందో రాదో కూడా తెలియక, ఎన్ని నెలలు ఆపుతారో తెలియక తిరగాల్సిన పరిస్థితి. – నువ్వు ఈ రోజు సాఫీగా సాగుతున్న పింఛన్ పంపిణీలో ఇబ్బంది రావడానికి కారణం నువ్వే అయ్యి జగన్ గారిని ప్రశ్నిస్తున్నాడు. – ఈ రోజు పరిస్థితికి చంద్రబాబే కారణం. – పోనీ ప్రభుత్వం తన పనేదో తాను చేసుకుంటూ వెళ్తుంటే మళ్లీ మధ్యలో దూరతాడు. – నానా యాగీ చేసి డీబీటీ ద్వారానే ఇవ్వండి అని ఈసీ నుంచి ఆదేశాలు తెప్పించాడు. – మళ్లీ ఇప్పుడు లేదు లేదు ఇంటింటికి తిరిగి ఇవ్వాల్సిందే అంటాడు. *అసలు నీకు సిగ్గూ ఎగ్గూ ఏమీ ఉండవా చంద్రబాబు..?:* – అసలునీకు సిగ్గూ ఎగ్గూ ఏమీ ఉండవా చంద్రబాబూ? – నిన్న నువ్వేం చేశావ్...ఈ రోజు ఈ దుస్థితికి కారణం నువ్వు కాదా అని నిన్ను అడుగుతారనే సిగ్గు కూడా లేదా? – వాళ్లంతా రేపు నీ ముఖం మూడు ఉమ్మేకపోతే చూడు. – ఇప్పుడు చంద్రబాబు పరిస్థితి పెనం మీద నుంచి పోయ్యిలో పడ్డట్లు అయిపోయింది. – ఇప్పుడు వచ్చి ఇంటింటికీ పంచమంటున్నావే..నీ హయాంలో అలా పంచడానికి కనీస ప్రయత్నం అన్నా చేశావా? – నువ్వంటున్న 1.20 లక్షల ఉద్యోగులకు వేరే పని ఏమీ ఉండదా? – ఆ పనులు చేసుకుంటూ పింఛన్ల పంపిణీకి అవకాశం ఉన్న వారితో పంపిణీ చేస్తున్నారు. – కనీసం ఇంటి పక్కనే ఉన్న సచివాలయం నుంచి తెచ్చుకునేదానికి కూడా నువ్వు గండి కొట్టి దూరంగా ఉన్న బ్యాంకు వద్దకు వెళ్లేటట్లు చేశాడు. – మళ్లీ ఈ పాపమంతా నీదే అంటూ జగన్ గారిని తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతున్నాడు. – ఆనాడు ఎండలో అల్లాడుతున్న వృద్ధులను చూసైనా ఇంటింటికీ పంచాలనే ఆలోచన నీకు రాలేదా? – వారి కష్టాలను చూసే కదా జగన్ గారికి ఇటువంటి ఆలోచన వచ్చింది. మరి నీకెందుకు రాలేదు. – ఆ వయసులో వారి ఆలనా పాలనా చూసుకుని కష్టం లేకుండా చేయాలని జగన్ గారు మొదటి ప్రాధాన్యం కింద ఇంటికే పింఛన్లు అందిచారు. – అందువల్లే జగన్ గారికి అందరి ఆదరణ దక్కింది. – నీ హయాంలో నువ్వు పాపం చేశావ్. దాన్ని సరిదిద్ది ఇంటివద్దే పంచుతుంటే దాన్నీ నాశనం చేశావ్. – ఇప్పుడు నువ్వు తప్పుకో..నేనిస్తా అంటున్నాడు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరినీ ఇవ్వమంటావా? – అడిగి చూడు..నీ మూతి పగలగొడతారు. అదే నిజమైతే ఆ రోజు ఎందుకు చేయించలేకపోయావ్? *నీ హయాంలో నీ కళ్లు నెత్తికెక్కాయా? అప్పుడెందుకు ఇంటింటికీ పంచలేదు..?:* – అప్పుడు నీకు కళ్లు మూసుకుపోయాయా లేక కళ్లు నెత్తికెక్కాయా? వారి కష్టాలు కనిపించలేదా? – నీకు మామూలు బాషలో చెప్తే ఎలాగూ అర్థం కావడం లేదు. – అసలు ఆయన ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా నిరాశలో సంధి ప్రేలాపనలు పేలుతున్నాడు. – ఆయన నిర్వాకం వల్ల వృద్ధులు ఎవరైనా ఇబ్బంది పడితే దానికి బాధ్యులు శ్రీశ్రీశ్రీ చంద్రబాబునాయుడే. – ఆయనకు వంత పాడుతున్న దత్తపుత్రుడు, ఆయన వదిన పురందేశ్వరిలే అవుతారు. – దీనికంతటికీ వైఎస్సార్సీపీ ఏ మాత్రం బాధ్యత కాదు. పరిపాలన అంతా చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో నడుస్తోంది. – నువ్వు మర్యాదగా దీనిలోకి జోక్యం చేసుకుండా ఉండి ఉంటే, మళ్లీ వత్తడి తీసుకురాకుండా ఉంటే మళ్లీ రెండు,మూడు రోజుల్లో అయిపోయేది. – సచివాలయానికి వచ్చి తీసుకునే వాళ్లు తీసుకునేవారు..రాలేని వాళ్లకు ఇళ్లకు తీసుకెళ్లి ఇచ్చేవారు. – ఎవరైతే 66 లక్షల మందికి ఆ విషయం బాగా తెలుసు. ఈ రోజు దీనికి కారణం చంద్రబాబే అన్న విషయం వారికి స్పష్టంగా తెలుసు. – నువ్వు 2014–19 మధ్య నువ్వేం చేశావో వాళ్లు మర్చిపోలేదు. – అసలు ఈ సిస్టమ్ తీసుకొచ్చి సమర్ధంగా జగన్ నడుపుతుంటే ఈ ఆలోచన నాకు ఎందుకు రాలేదని ఆలోచించాలి. – ఆ 1.20 లక్షల మందిని నువ్వు పెట్టినట్లు డిమాండ్ చేస్తున్నాడు. – ప్రజలు జగన్కి అధికారం ఇచ్చారు. మంచి చేస్తున్నాడు..దానిలో వేలు పెట్టడం తప్పు అని అనుకోవాలి కదా. – నా 14 ఏళ్ల చరిత్రలో ఇలా నేను చేయలేదు కదా..నాకు అర్హత ఏం ఉందని అనుకోవాలి కదా? *దీనికి బాధ్యుడు చంద్రబాబే..ఫలితం అనుభవించక తప్పదు:* – దీనికి బాధ్యుడివి నువ్వే...దాని ఫలితం కూడా నువ్వే అనుభవించాలి. – అసలు 23 సీట్లు పెట్టుకుని నువ్వు హుకం జారీ చేయడం ఏంటి? – రేపు ఆ 23 కాస్తా సింగిల్ డిజిట్కి దిగిపోయే పరిస్థితి ఉంది. – అలాంటి నువ్వు నేను హుకం జారీ చేస్తున్నా అంటూ ఆదేశాలు ఇవ్వడం ఏంటో అర్ధం కావడం లేదు. – కేంద్రంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత ఒళ్లంతా కొవ్వెక్కిందేమో అర్ధం కావడం లేదు. – నా కంటి చూపే శాసనం అన్నట్లు మాట్లాడుతున్నాడు. – ఇలా ప్రత్యర్థులను తిట్టడం, తాను శాశ్వితంగా అధికారంలోకి వచ్చేశానని హుకుం జారీ చేస్తున్నాడు. – ఈ పదిరోజులైనా అది మానుకుంటే ప్రజలకు కొంతైన ఉపశమనం కలుగుతుంది. – చంద్రబాబుకు డిపాజిట్లు కూడా గల్లంతు అవుతున్నాయనేది ఆయన మాటల్లోనే వ్యక్తం అవుతోంది. *కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం దత్తతండ్రి, దత్తపుత్రుడికే ఉంది:* – కులాల మధ్య చిచ్చు పెట్టే లక్షణం ఏదైనా ఉందంటే దత్తపుత్రుడికి, దత్త తండ్రికే ఉంది. – కులాలకు అతీతంగా ఆలోచించే వాడు కాబట్టే జగన్ గారిని ఆందరూ ఆదరిస్తున్నారు. – కులం కార్డుతోనే బయటపడాలనుకుంటున్నాడు కాబట్టే చంద్రబాబు దత్తపుత్రుడిని రంగంలోకి దించారు. – పవన్ కల్యాణ్ మాట్లాడుతున్నవన్నీ చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్ట్లో భాగమే. – తుని సంఘటనలో ఎవరిపై కేసులు పెట్టారు? కేసులు పెట్టింది ఈయన దత్తతండ్రి చంద్రబాబు కాదా? – ఇంకా వారికేమన్నా అనుమానం ఉంటే చిరంజీవి గారిని అడిగితే చెప్తారు. – ఎందుకంటే ఆ రోజు ఉద్యమానికి, ముద్రగడ పద్మనాభం గారికి సంఘీభావం తెలిపారు కూడా. – వైఎస్సార్సీపీ వారు చేయించారా, కడప జిల్లా వాళ్లు చేయించారా అనేది చిరంజీవి గారిని అడిగితే పవన్ కల్యాణ్కు స్పష్టత వస్తుంది. – మేనిఫెస్టో రోజు సీఎం గారు ప్రస్తావించిన పేరు సలహాదారు ధనుంజయ్రెడ్డి. అలాంటి పేర్లు చాలా మందికి ఉంటాయి. – చంద్రబాబు అనే పేరైతే రాష్ట్రంలో ఎవరికీ పెట్టి ఉండరు. అలా ఉండకూడదనే వాళ్ల నాన్న చంద్రబాబు అని పెట్టి ఉంటాడు. – మరుసటి రోజు వాళ్లు వెళ్లి చర్యలు తీసుకోండి అంటూ ఎన్నికల కమిషన్కు పిటిషన్ కూడా ఇవ్వడాన్ని చూసి నాకు నవ్వొచ్చింది. *ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై దుష్ప్రచారం చేస్తున్నారు:* – వీళ్ల విషప్రచారం ఎక్కడికి పోతుందంటే..ఇక మనం అధికారంలోకి రామనే భయంతో వ్యవస్థపై దాడి చేస్తున్నారు. – ప్రభుత్వం అనేది ఒక వ్యవస్థ. దానికి ఒక రూల్ ఆఫ్ లా అనేది ఉంటుంది. – అలాంటిది ఆస్తులను అమ్మేసుకోవడం ఈ వ్యవస్థలో సాధ్యమా? – లాండ్ టైటిలింగ్ యాక్ట్పై మీ భూములన్నీ పోతాయన్నట్లు చెప్తున్నారు. – టెక్నాలజీ పెరిగిన తర్వాత పేపర్లెస్కి వెళ్లాలనే ప్రయత్నాలు సాగుతుంటే వీరు చేసే ఆరోపణలు సాధ్యమా? – వీళ్ల ప్రచారం చూసి భయమేస్తోంది. వీళ్లు ప్రజల్లో వ్యవస్థపై నమ్మకం పోయేటట్లుగా విషప్రచారం చేస్తున్నారు. – ఇలాంటి ప్రచారం చేసే చంద్రబాబు అండ్ కో అసలు ఈ ప్రజాస్వామ్యంలో ఉండటానికి అర్హులేనా? – ఆయన హయాంలో ఐఎంజీ స్కాం చేసి భూములను అడ్డగోలుగా లాక్కోవలే ప్రయత్నం చేసిన చంద్రబాబే ఇప్పుడు ఈ ప్రచారం చేస్తున్నాడు. – ప్రజలు ఏమరిపాటుగా ఉంటే నిలువు దోపిడీ చేసే చేయి చంద్రబాబుది. – ఈ పది రోజులు ఇతన్ని ఎలా భరించాలో కూడా అర్ధం కావడం లేదు. – అసలు ప్రతిపక్షంగా కూడా మేం అనర్హులం అనేది వాళ్లు ప్రూవ్ చేసుకుంటున్నారు. – కాంగ్రెస్ పార్టీ ఒక పార్టీనేనా? షర్మిలమ్మ ఎక్కడనుంచి ప్రత్యక్షమయ్యారు? – తెలంగాణ నుంచి మాయం అయినందుకు అక్కడ సంజాయిషీ ఇచ్చారా? – ఇక్కడ అడ్డమైన ప్రశ్నలు అడగడం ఏంటి? ఆ అర్హత ఆపార్టీకి, ఆమెకు ఉందా? – 13వ తేదీ తర్వాత వీళ్లెవరు కనిపించరు.