నేడు వైయ‌స్ఆర్ రైతు భ‌రోసా సాయం విడుద‌ల‌

వ‌రుస‌గా నాలుగో ఏడాది మూడో విడ‌తగా 51.12 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను జ‌మ చేయ‌నున్న సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌

తాడేపల్లి: వరుసగా నాలుగో ఏడాది మూడో విడ‌త వైయస్ఆర్ రైతుభరోసా సాయాన్ని రైతుల ఖాతాల్లో ముఖ్య‌మంత్రి వైయ‌స్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి నేడు జ‌మ చేయ‌నున్నారు. ఈ ఏడాది మూడో విడతగా 51.12 లక్షల మందికి రూ.1,090.76 కోట్లను సీఎం వైయ‌స్ జ‌గ‌న్ మంగళవారం తెనాలి మార్కెట్‌యార్డులో జరిగే కా­ర్య­క్రమంలో నేరుగా వారి ఖాతాల్లోకి జమచేయనున్నారు. రైతులకు ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం అందిస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇవ్వగా, అంతకంటే మిన్నగా ఏటా రూ.13,500 చొప్పున అందిస్తున్నారు. వరు­సగా నాలుగో ఏడాదిలో కూడా ఇప్పటికే రెండు విడతల్లో రూ.11,500 సాయం అందించారు. మూడో విడతగా ఒక్కొక్కరికి మరో రూ.2వేల చొప్పున 51.12 లక్షల మంది రైతన్నల ఖాతాల్లో రూ.1,090.76 కోట్లను సీఎం వైయ‌స్ జగన్‌ నేడు జమచేయనున్నారు. అదే విధంగా 2022 డిసెంబర్‌లో మాండూస్ తుపాన్‌ ప్రభావంతో నష్టపోయిన 91,237 మంది వ్యవసాయ, ఉద్యాన రైతన్నలకూ రూ.76.99 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సిడీ మొత్తాన్ని రబీ సీజన్‌ ముగియక ముందే వారి ఖాతాల్లో జమచేస్తున్నారు. ఈ మొత్తంతో కలిపి ఇప్పటివరకు 22.22 లక్షల మంది రైతన్నలకు రూ.1,911.78 కోట్ల ఇన్‌పుట్‌ సబ్సి­డీని అందించారు. ఇలా గడిచిన మూడేళ్ల తొమ్మిది నెలల్లో రైతులకు మొత్తం మీద నేరుగా రూ.1,45,751 కోట్ల లబ్ధిని చేకూర్చారు. 

తాజా వీడియోలు

Back to Top