తాడేపల్లి: మాజీ సీఎం, వైయస్ఆర్సీపీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం గుంటూరు జిల్లా తెనాలిలో పర్యటిస్తారు. ఇటీవల పోలీసుల దాడిలో గాయపడ్డ జాన్ విక్టర్ కుటుంబాన్ని వైయస్ జగన్ పరామర్శించనున్నారు. మంగళవారం ఉదయం 9.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి తెనాలి ఐతానగర్ చేరుకుంటారని, జాన్ విక్టర్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి తాడేపల్లి బయలుదేరుతారు.