మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి నూతన వధూవరులను ఆశీర్వదించిన సీఎం వైయస్ జగన్ఏపీలో మహిళలు ధైర్యవంతులు అనేలా శక్తినిచ్చారునెల్లూరు రూరల్లో టీడీపీ, జనసేన పార్టీలకు షాక్కట్టకట్టుకుని వస్తున్న పెత్తందారులందరినీ ఓడించడానికి సమయం వచ్చింది జిమ్మిక్కులతో పగటివేషగాళ్లు వస్తున్నారు..జాగ్రత్త
వీవోఏల జీవితాల్లో వెలుగులు
12 Nov 2019 2:03 PM
వీవోఏల వేతనం రూ.10 వేలకు పెంపు పట్ల హర్షం
సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు
విశాఖ: క్షేత్రస్థాయిలో మహిళా స్వయంశక్తి సంఘాలకు అన్ని విధాలా చేదోడువాదోడుగా ఉంటున్న వెలుగు వీవోఏల జీవితాల్లో ప్రభుత్వం వెలుగులు నింపింది. ఐదు నెలల క్రితం అధికారంలోకి వచ్చిన వైయస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం వీవోఏలపై కరుణ చూపింది. వారి కృషిని గుర్తించి.. జీవితాల్లో కొత్త వెలుగు నింపే నిర్ణయం తీసుకుంది. వారికిస్తున్న గౌరవవేతనాన్ని రూ.3 వేల ఏకంగా రూ.10వేలు చేసింది. దీంతో ప్రజాసంకల్పయాత్రలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన మరో హామీ అమల్లోకి తెచ్చారు. వీవోఏల వేతనం రూ.10 వేలు పెంచుతూ ప్రభుత్వం ప్రభుత్వం జీవో జారీ చేయడంతో వెలుగు ఉద్యోగులు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా సీఎం చిత్రపటాలకు క్షీరాభిషేకాలు చేశారు. ర్యాలీలు నిర్వహిస్తున్నారు. థ్యాక్స్ జగనన్న అంటూ నినదిస్తున్నారు.