మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
కనుల పండుగగా ఆలయాల పునర్నిర్మాణం
08 Jan 2021 11:22 AM
తొలి విడతలో 9 ఆలయాల నిర్మాణాలకు సీఎం వైయస్ జగన్ శంకుస్థాపన
రూ.70 కోట్లతో దుర్గ గుడి అభివృద్ధి..విస్తరణ పనులకు భూమి పూజ
విజయవాడ: తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కూల్చిన ఆలయాల పునర్నిర్మాణానికి ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారు. కొద్దిసేపటి క్రితం ఆలయాల పునర్నిర్మాణ కార్యక్రమం కనుల పండుగగా జరిగింది.విజయవాడలోని దక్షిణముఖ ఆంజనేయస్వామి, సీతమ్మవారి పాదాలు, రాహు-కేతువు, బొడ్డుబొమ్మ, గోశాల కృష్టుడి ఆలయం, కృష్ణా నది ఒడ్డున సీతమ్మ పాదాల వద్ద ఆలయాల పునర్నిర్మాణానికి సీఎం శంకుస్థాపన చేశారు. రూ.77 కోట్లతో ఇంద్రకీలాద్రి అభివృద్ధి పనులను సీఎం వైయస్ జగన్ భూమి పూజ చేసి ప్రారంభించారు. ఆలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి వైయస్ జగన్కు దుర్గ గుడి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలుకగా, మంత్రులు, ఎమ్మెల్యేలు ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, బోత్స సత్యనారాయణ, కొడాలి నాని, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, జోగి రమేష్, రక్షణ నిధి, వంశీ, చైర్మన్ పైలా సోమినాయుడు, దేవినేని అవినాస్ తదితరులు పాల్గొన్నారు.