‘జగనన్న విద్యాదీవెన’ ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్‌

 తాడేపల్లి : ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి మరో ప్రతిష్టాత్మక పథకానికి శ్రీకారం చుట్టారు. మంగళవారం ‘జగనన్న విద్యా దీవెన’ పథకాన్ని సీఎం వైయస్‌ జగన్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా వివిధ జిల్లాల విద్యార్థులతో సీఎం వైయస్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కింద రూ. 4 వేల కోట్లు విడుదల చేశారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నడూ లేని విధంగా పూర్తి ఫీజును రీయింబర్స్‌మెంట్‌ అందజేయనున్నారు. గత ప్రభుత్వం చెల్లించాల్సిన రూ.1,880 కోట్ల బకాయిలను కాలేజీలకు చెల్లించారు. 

నేరుగా తల్లుల ఖాతాల్లోకి ..
ఈ పథకం ప్రకారం.. రానున్న విద్యా సంవత్సరం (2020–21)లో ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను కాలేజీలకు కాకుండా నేరుగా తల్లుల ఖాతాల్లోకి ప్రభుత్వం జమ చేయనుంది. దాదాపు 14 లక్షల మంది తల్లుల ఖాతాల్లో నాలుగు దఫాలుగా (నాలుగు త్రైమాసికాలకు) డబ్బు వేయనున్నారు. కానీ, తల్లిదండ్రులు మాత్రం కాలేజీకి వెళ్లి ఫీజు కట్టాల్సి ఉంటుంది.

చరిత్రలో ఇదే మొదటిసారి..
ఫీజు రీయింబర్స్‌మెంట్‌ కోసం ఒకేసారి ఇంత పెద్ద మొత్తం విడుదల చేయడం చరిత్రలో ఎన్నడూలేదు. విద్యార్థుల భవిష్యత్‌పట్ల ముఖ్యమంత్రి  సీఎం జగన్‌ ఉన్న చిత్తశుద్ధికి ఇది నిదర్శనమని విద్యావేత్తలు కొనియాడుతున్నారు.  ఈ నిర్ణయం విద్యా వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు. కాగా, 2019–20 విద్యా సంవత్సరానికి సంబంధించి తల్లిదండ్రులు కాలేజీలకు ఫీజులు చెల్లించి ఉంటే.. ఆ మొత్తం ఏప్రిల్‌ నెలాఖరులోగా తిరిగి ఇచ్చేసేందుకు కాలేజీ యాజమాన్యాలను సంప్రదించాలని విద్యాశాఖ సూచించింది. 2018–19, 2019–20లో రూ.35 వేలు ఫీజు ఉన్న కాలేజీలకు ఇప్పటికే ఏమైనా కట్టి ఉంటే.. ఆ సొమ్మును కూడా తిరిగి రాబట్టుకోవాలని తెలిపింది.

Back to Top