నేడు తుపానుపై పార్టీ నేతలతో వైయ‌స్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్ 

తాడేప‌ల్లి: మోంథా తుపాను నేపథ్యంలో వైయ‌స్ఆర్‌సీపీ రీజినల్‌ కో–ఆర్డి­నేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులతో గురు­వా­రం ఉద‌యం11 గంటలకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి మాజీ సీఎం, వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైయ‌స్‌ జగన్‌ వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించను­న్నారు. తుపాను తర్వాత జిల్లాల్లో నెలకొన్న ప­రి­స్థి­తులు, పంట నష్టం వంటి వివరాలను పార్టీ కేడర్‌ను ఆయన అడిగి తెలుసుకోను­న్నారు.  

బాధితులకు ప్రభుత్వం నుంచి తగిన సహాయం అందేలా ఒత్తిడి తీసుకురావడంపై నాయకులకు దిశానిర్దేశం చేయనున్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో బాధితులకు అండగా నిలవాలన్న వైయ‌స్‌ జగన్‌ పిలుపు మేర­కు పార్టీ నాయకులు, శ్రేణులు క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేశారు. శ్రీకాకుళం నుంచి తిరు­పతి వరకూ జిల్లా అధ్యక్షులు, నియోజ­కవర్గ సమన్వయకర్తలు, పార్టీ కార్యకర్తలు తుపాను బాధితులకు బాసటగా నిలిచారు. 

ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించడంలో, వారి­కి ఆహారం అందించడంలో సేవలందించారు.  తుపానువల్ల దెబ్బతిన్న ప్రాంతాల్లో క్షేత్రస్థా­యిలో పర్యటించి నష్టపోయిన బాధితు­లకు భరోసా ఇవ్వడంతో పాటు వివ­రాలను సేకరించారు. వాటిని వీడియో కాన్ఫరెన్స్‌లో వైయ‌స్‌ జగన్‌కు వివరించనున్నారు.  

Back to Top