కాకినాడ జిల్లా టీడీపీ నేతలు వైయస్ఆర్సీపీలో చేరికవైయస్ఆర్సీపీలో చేరిన జనసేన రాష్ట్ర కార్యదర్శి పోలసపల్లి సరోజపిఠాపురం కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ పంతం ఇందిర వైయస్ఆర్సీపీలో చేరికజనసేన నెల్లూరు జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్ రెడ్డి వైయస్ఆర్సీపీలో చేరికకోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్
వైయస్ జగన్.. ఓ భరోసా
01 Apr 2019 10:50 AM
వైయస్ భారతి
సింహాద్రిపురంలో వైయస్ భారతీరెడ్డి ఎన్నికల ప్రచారం
‘నవరత్నాలు’ పథకంతో అందరికీ మేలు
పులివెందుల: వైయస్ఆర్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైయస్ జగన్మోహన్రెడ్డి అంటే ఓ భరోసా అని ఆయన సతీమణి వైయస్ భారతీరెడ్డి స్పష్టం చేశారు. వైయస్ఆర్ జిల్లా పులివెందుల నియోజకవర్గంలోని సింహాద్రిపురం మండలంలో ఆమె ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ తిరిగి ప్రజలతో మమేకమయ్యారు. వైయస్ఆర్సీపీ అధికారంలోకి రాగానే అన్ని వర్గాల ప్రజల సంక్షేమం, అభివృద్ధికి వైయస్ జగన్మోహన్రెడ్డి పాటుపడతారని హామీ ఇచ్చారు. ఆమె మాట్లాడుతూ తాము నిర్వహిస్తున్న ప్రచారానికి ప్రజల్లో మంచి స్పందన వస్తుందని తెలిపారు. వైయస్ జగన్ ప్రవేశపెట్టనున్న ‘నవరత్నాలు’ పథకాల ద్వారా ప్రజలందరికీ మేలు జరుగుతుందన్నారు. సీఎం చంద్రబాబు పరిపాలనను ప్రజలు చూశారని, ఆయన ఇచ్చిన హామీల్లో ఒక్క హామీనీ నెరవేర్చలేదన్నారు. వైయస్ జగన్మోహన్రెడ్డి ఒక్క మాట చెబితే చాలు.. చేస్తారనే నమ్మకం ప్రజల్లో ఉందని పునరుద్ఘాటించారు.