`యువత పోరు` పోస్ట‌ర్ ఆవిష్క‌ర‌ణ‌

తాడేప‌ల్లి:   వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి పిలుపు మేర‌కు ఈ నెల 23 తేదీన జరిగే యువత పోరు కార్య‌క్ర‌మానికి సంబంధించిన పోస్ట‌ర్‌ను విశాఖ‌, క‌ర్నూలు, త‌దిత‌ర ప్రాంతాల్లో పార్టీ నేత‌లు ఆవిష్క‌రించారు. విశాఖ జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు కేకే రాజు, వరుదు కళ్యాణి, వాసుపల్లి గణేష్, దేవన్ రెడ్డి మొల్లి అప్పారావు, త‌దిత‌రులు పోస్ట‌ర్ విడుద‌ల చేయ‌గా, క‌ర్నూలు న‌గ‌రంలోని పార్టీ కార్యాల‌యంలో జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్‌రెడ్డి, త‌దిత‌రులు పోస్ట‌ర్‌ను ఆవిష్క‌రించారు. ఈ సంద‌ర్భంగా కేకే రాజు, ఎస్వీ మోహ‌న్ రెడ్డి వేరు వేరుగా మాట్లాడుతూ..`యువత విద్యార్థులకు ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయాలి. ఎన్నికలకు ముందు నిరుద్యోగ భృతి 3 వేలు ఇస్తామన్నారు. ఇంటికొక ఉద్యోగం అన్నారు. యువతకు 20 లక్షల ఉద్యోగాలన్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదు. సంవత్సర కాలంగా ఉద్యోగం, ఉపాధి, నిరుద్యోగ భృతి ఇవ్వకుండా యువతను మోసం చేసిన వైనాన్ని ప్రజలకు తెలియచెప్పేలా, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు తలపెట్టిన "యువత పోరుష కార్య‌క్ర‌మాన్ని విజ‌య‌వంతం చేయాల‌ని వారు పిలుపునిచ్చారు.  కార్య‌క్ర‌మంలో కర్నూలు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు ఎద్దుల శివారెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షులు , యువకులు పాల్గొన్నారు.

Back to Top