సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు ఉత్తరాంధ్రలో అడుగు పెట్టిన సీఎం వైయస్ జగన్‘బోండా ఉమా తప్పు చేశాడు.. అందుకే భయపడుతున్నాడు’అమలాపురం జనసేన నేత వైయస్ఆర్సీపీలో చేరిక19వ రోజు ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర ప్రారంభం మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్
రాజధాని రైతులకు సీఎం న్యాయం చేస్తారు
27 Dec 2019 1:00 PM
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
విజయవాడ: రాజధాని ప్రాంత రైతులకు సీఎం వైయస్ జగన్మోహన్రెడ్డి న్యాయం చేస్తారని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ అన్నారు. జీఎన్రావు కమిటీ అన్ని జిల్లాలు పర్యటించి ప్రజాభిప్రాయాలు సేకరించిన తరువాతే నివేదిక ఇచ్చిందన్నారు. అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలని జీఎన్రావు కమిటీ నివేదిక చెప్పిందన్నారు. అనుభవం పేరుతో 2014లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఐదేళ్లు రాజధాని పేరుతో ప్రజలందరినీ మోసం చేశారన్నారు. ముఖ్యంగా రాజధాని ప్రాంత రైతుల నుంచి భూములు లాక్కొని వారిని దగా చేశారన్నారు. అమరావతిలో నాలుగైదు తాత్కాలిక భవనాలు కట్టి గ్రాఫిక్స్ చూపించి ప్రజలను మభ్యపెట్టారన్నారు. ఇప్పుడు మళ్లీ రాజకీయ కుట్రకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం సీఎం వైయస్ జగన్ కట్టుబడి ఉన్నారన్నారు.