కడప : జిల్లాలో మూడు రోజుల పర్యటనలో భాగంగా గోపవరం, కడప, ఇడుపులపాయ, సింహాద్రిపురం, పులివెందుల పర్యటన సందర్భంగా మొదటి రోజు శనివారం ఉదయం 11.33 గంటలకు కడప విమానాశ్రయం కు చేరుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది. కడప విమానాశ్రయంలో జిల్లా ఇంచార్జీ మంత్రి ఆదిమూలపు సురేష్, డిప్యూటీ సిఎం అంజాద్ భాష,కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, సి. రామచంద్రయ్య, ఎం. రామచంద్రా రెడ్డి, జడ్పి చైర్మన్ ఆకెపాటి అమర్నాథ్ రెడ్డి, నగర మేయర్ కె. సురేష్ బాబు, ఎమ్మెల్యేలు రవీంద్రనాథ్ రెడ్డి, రఘురామిరెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ వి. విజయ్ రామరాజు, రాయలసీమ డి.ఐ.జి.సెంథిల్ కుమార్, కడప నగర పాలక సంస్థ కమీషనర్ సూర్య సాయి ప్రవీణ్ చంద్, జిల్లా ఎస్పీ సిద్దార్థ్ కౌశల్, ఎఎస్పీ తుషార్ డూడి, ట్రైనీ కలెక్టర్ మౌర్య భరద్వాజ్, కడప ఆర్డీఓ మధుసూదన్, వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సంబటూరు పి. శివవప్రసాద్ రెడ్డి, ఎయిర్ పోర్ట్ అధికారులు శ్రీనివాస్, సురేష్, నేతలు భరత్ రెడ్డి, ఇతర నాయకులు అధికారులు, తదితరులు పుష్పగుచ్ఛాలు అందజేసి ఘన స్వాగతం పలికారు. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రి వైయ జగన్ మోహన్ రెడ్డి ఆప్యాయంగా అందరిని పేరుపేరున పలకరించి గోపవరం కు మధ్యాహ్నం 12.00 గంటలకు హెలికాఫ్టర్ లో బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి గారి తో పాటు జిల్లా కలెక్టరు వి. విజయ్ రామరాజు, కడప ఎంపీ వై.ఎస్. అవినాష్ రెడ్డి బయలుదేరి వెళ్లారు.