కోడుమూరు నియోజకవర్గంలో టీడీపీకి షాక్ సంక్షేమాన్ని.. అభివృద్ధిని చూసి ఆశీర్వదించండిఎస్టీ రాజాపురం నుంచి మేమంతా సిద్దం బస్సు యాత్ర ప్రారంభంవైయస్ఆర్సీపీ ప్రచార రథాలు ప్రారంభంచంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం
టీడీపీ చిల్లర రాజకీయాలు
22 Apr 2022 2:42 PM
మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ
విజయవాడ: బాధితురాలికి ధైర్యం చెప్పేందుకు ఆసుపత్రికి వస్తే టీడీపీ చిల్లర రాజకీయాలు చేస్తోందని మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో బాధితురాలిని వాసిరెడ్డి పద్మ పరామర్శించారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా కల్పించారు. అయితే అత్యాచార బాధితురాలిని పరామర్శించడానికి వెళ్తే.. టీడీపీ దౌర్జన్యానికి పాల్పడిందని వాసిరెడ్డి పద్మ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళల పట్ల రాజకీయం చేయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా అని ప్రశ్నించారు. మహిళా కమిషన్ చైర్పర్సన్పై బెదిరించే స్థాయికి చంద్రబాబు దిగజారనని విమర్శించారు. తనపై దాడికి దిగిన వారిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
తాను ఆసుపత్రికి వచ్చే సరికి తెలుగు దేశం నాయకులు ఆసుపత్రి ముందు మోహరించి ఉన్నారని తెలిపారు. టీడీపీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఆసుపత్రికి వస్తున్నాడని నన్ను వెళ్లడానికి వీళ్లేదని అడ్డుకున్నారు. వాసిరెడ్డి పద్మ గో బ్యాక్ అంటూ గొడవ చేశారు. అయినా నేను ఆసుపత్రి వద్ద రాజకీయాలు చేయడం సరికాదని సీరియస్ వార్నింగ్ ఇచ్చాను. టీడీపీ నేతలను నెట్టుకుంటూ, వారి నుంచి తప్పించుకొని లొపలికి అడుగుపెట్టాను. లొపలికి వచ్చాక కూడా టీడీపీకి చెందిన దాదాపు 50 మంది వరకు పెద్ద పెద్దగా అరుస్తూ ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించారు.
బాధితురాలిని పరామర్శిస్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. అయినా కూడా సంయమనం పాటించి ఉన్నాను. బాధితురాలితో మాట్లాడుతుండగా బోండా ఉమా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నాతో అనుచితంగా ప్రవర్తించారు. చంద్రబాబు సైతం బెదిరించే ప్రయత్నం చేశారు. చంద్రబాబు సమక్షంలో టీడీపీ మహిళా నేతలు నాపై వేలు చూపిస్తూ దౌర్జన్యానికి దిగారు. చంద్రబాబు అందరిని రెచ్చగెడుతున్నారు. మహిళా నాయకుల పట్ల గౌరవం లేకుండా ప్రవర్తిస్తున్నారు. బొండా ఉమాపై పోలీసులకు ఫిర్యాదు చేస్తాను’ అని తెలిపారు.