వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
జీ-20 వేదికపై మన సంస్కృతిని చాటుతాం
08 Dec 2022 2:13 PM
రాజ్యసభలో వైయస్ఆర్ సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నకు కేంద్రమంత్రి జవాబు
న్యూఢిల్లీ : భారతీయ సంస్కృతి, వారసత్వాన్ని ప్రచారం చేసేందుకు జీ-20 వేదికను వినియోగిస్తామని సాంస్కృతిక శాఖ సహాయ మంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి వెల్లడించారు. రాజ్యసభలో గురువారం ప్రశ్నోత్తరాల సమయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యులు విజయసాయి రెడ్డి అడిగిన పలు ప్రశ్నలకు ఆమె జవాబిస్తూ ఈ విషయం తెలిపారు. భారతీయ సంస్కృతి, ప్రాచీన సంస్కృతి పరిరక్షణకు, చోరీకి గురై దేశం నుంచి తరలిపోయిన ప్రాచీన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటోంది..? అలాగే జీ-20 వేదికగా భారత సంస్కృతి, సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఏమైనా చర్యలు తీసుకుంటున్నారా..? అని విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నలకు కేంద్రమంత్రి సవివరంగా సమాధానాలు చెప్పారు.
జీ-20 వేదికపై భారతీయ సంస్కృతిక వారసత్వాన్ని ప్రతిబింబచేసే దిశగా ప్రభుత్వం జీ-20 భాగస్వామ్య దేశాలన్నింటితోనూ సంప్రదింపులు జరుతున్నట్లు కేంద్రమంత్రి శ్రీమతి మీనాక్షి లేఖి తెలిపారు. చోరీకి గురైన ప్రాచీన కళాఖండాలను తిరిగి దేశాలను రప్పించే విషయంలో యునెస్కో ఒడంబడికకు లోబడి కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఈ ఒడంబడికపై సంతకాలు చేసిన రెండు దేశాల మధ్య ఆయా దేశాల వారసత్వ సంపదను పర్సపరం కాపాడాలి. దీనికి సంబంధించి ఇటీవలే స్కాట్లాండ్ విదేశాంగ మంత్రితో చర్చలు జరిపినట్లు చెప్పారు. అలాగే వివిధ దేశాల ప్రతినిధులతో సంప్రదింపులు కొనసాగుతున్నాయి. ఇదో నిరంతర ప్రక్రియ. చోరీకి గురై విదేశాలకు తరలిపోయిన కళాఖండాలను తిరిగి వెనక్కి రప్పించే ప్రక్రియలో అనేక ఇబ్బందులు ఎదురవుతున్నట్లు కేంద్రమంత్రి తెలిపారు. చోరీకి గురైన కళాఖండాలకు సంబంధించి సరైన వివరాలు లేకపోవడం, చోరీ జరిగినట్లు రిపోర్టు కాకపోవడం వంటి తగిన డాక్యుమెంట్ ఆధారాలు లభ్యం కానందున ఈ ప్రక్రియలో జాప్యం చోటు చేసుకుంటున్నట్లు కేంద్రమంత్రి వివరించారు.