కాకినాడ మేయర్‌గా సుంకర శివప్రసన్న ఏకగ్రీవ ఎన్నిక

తూర్పుగోదావరి: కాకినాడ మున్సిప‌ల్ కార్పొరేష‌న్‌ మేయర్‌గా సుంకర శివప్రసన్న, డిప్యూటీ మేయర్‌గా మీసాల ఉదయ్‌కుమార్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎన్నిక అనంతరం మేయర్‌ శివప్రసన్న మీడియాతో మాట్లాడుతూ.. కాకినాడ నగర అభివృద్ధికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. సహచర కార్పొరేటర్ల సహకారంతో న‌గ‌రాన్ని సుంద‌రంగా తీర్చిదిద్దుతామ‌న్నారు. ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డికి ఆమె కృతజ్ఞతలు తెలిపారు. గ‌తంలో మేయ‌ర్‌గా ప‌నిచేసిన సుంకర పావనిపై మెజార్టీ కార్పొరేటర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గడంతో.. ఆమెను తొలగిస్తూ ప్రభుత్వం ఈ నెల 12న గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఖాళీగా ఉన్న మేయర్, డిప్యూటీ మేయర్‌ పదవులకు నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో ఈ రోజు ఉదయం ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నిక‌కుటీడీపీ కార్పొరేటర్లు హాజరుకాలేదు.

Back to Top