విశాఖ శ్రీ‌శార‌దా పీఠం వార్షికోత్స‌వానికి సీఎంకు ఆహ్వానం

తాడేప‌ల్లి: విశాఖ శ్రీ శారదా పీఠం ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి తాడేప‌ల్లిలోని సీఎం నివాసంలో ముఖ్యమంత్రి వైయ‌స్ జగన్‌మోహ‌న్‌రెడ్డిని కలిశారు. ఫిబ్రవరి 7 నుంచి 11 వరకు నిర్వ‌హించ‌నున్న‌ శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవాలకు హాజ‌రుకావాల‌ని కోరారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్‌కు వేద ఆశీర్వచనం ఇచ్చి.. శ్రీ శారదా పీఠం వార్షిక మహోత్సవ ఆహ్వాన‌ పత్రికను అందించారు. శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామితో టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు.

Back to Top