సోషల్‌ మీడియా యాప్‌ను ప్రారంభించిన సీఎం వైయస్‌ జగన్ 

తాడేపల్లి: కోవిడ్‌-19 నివారణకు ప్రభుత్వం తీసుకుంటున్న నియంత్రణ చర్యలపై సమగ్ర సమాచారాన్ని సోషల్‌ మీడియా ద్వారా తెలుసుకునేందుకు  ప్రత్యేకంగా యాప్‌ను రూపొందించారు. ఈ యాప్‌ను ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో శనివారం ఆవిష్కరించారు.  వాట్సప్, పేస్‌బుక్‌ మెసెంజర్‌ చాట్‌ బోట్‌లను క్యాంపు కార్యాలయంలో సీఎం ప్రారంభించారు. కార్యక్రమంలో డిప్యూటీ సీఎం ఆళ్లనాని, హోం  మంత్రి మేకతోటి సుచరిత, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Back to Top