చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
విజయవాడ నగర అభివృద్ధికి చర్యలు
29 Nov 2019 1:06 PM
మంత్రి బొత్స సత్యనారాయణ
విజయవాడ: విజయవాడ నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించించారని, ఆ దిశగా చర్యలు చేపట్టినట్లు మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. మంత్రులు వెల్లంపల్లి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణుతో కలిసి బొత్స సత్యనారాయణ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటించారు. డంపింగ్ యార్డ్ తరలింపుపై విజయవాడ మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్కు ఆయన కీలక సూచనలు చేశారు. సింగ్ నగర్లో డంపింగ్ యార్డును తరలించి అదే ప్రాంతంలో పార్క్ను ఏర్పాటు బొత్స సత్యానారాయణ పేర్కొన్నారు. అందులో భాగంగా వాంబే కాలనీ డంపింగ్ యార్డు ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని స్పష్టం చేశారు. ప్రజల ఇబ్బందులను పరిగణనలోకి తీసుకొని సింగ్నగర్లోని డంపింగ్ యార్డ్ను గుంటూరుకు తరలించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. నీటి ఇబ్బందులు ఎదుర్కొంటున్న వాంబే కాలనీ, సింగ్ నగర ప్రాంతవాసుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపుతామని మంత్రి హామీ ఇచ్చారు.