అమరావతి: ఈ ఒక్క గెలుపు చూసుకుని తాము ఏదో సాధించామని టీడీపీ అనుకుంటే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 175 స్థానాల్లో పోటీ చేయాలని ప్రతిపక్ష నేత చంద్రబాబుకు వైయస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సవాల్ విసిరారు. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్నీ ఎన్నికల్లో తమకు సంఖ్యాబలం ఉంది కాబట్టే ఏడుగుర్ని పోటీలో పెట్టామన్నారు. డబ్బులు ఎర చూపడం వల్లే టీడీపీ ఒక స్థానంలో గెలిచిందని, డబ్బులు ఆశ చూపి ఎమ్మెల్యేలను కొన్నారని ఆయన పేర్కొన్నారు. గతంలోనూ అలాగే టీడీపీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ఇప్పుడు కూడా అదే చేశారన్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో తనను కలిసిన మీడియాతో ప్రభుత్వ సలహాదారు (ప్రజావ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే: - వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి విధానాలు నచ్చి మాకు మద్దతు పలికిన.. టీడీపీ, జనసేన వారిని కలుపుకుని పోటీ పెట్టాం. - టీడీపీ నుంచి నలుగురు శాసనసభ్యులు, జనసేన నుంచి ఒకరు మొదటి నుంచీ ఇండిపెండెంట్గా ఉన్నారు... - దాంతో మాకు కావాల్సిన 22 మంది సభ్యులు కరెక్ట్ గా ఉన్నారు కాబట్టి మాకే 7 సీట్లు రావాలి..అందుకే పోటీ పెట్టాం - చంద్రబాబునాయుడు ఏ దీమాతో అభ్యర్థిని పెట్టారో ఆయనే సమాధానం చెప్పాలి. - నెల్లూరు రూరల్, వెంకటగిరి శాసనసభ్యులను లెక్కలోకి వేసుకోకపోయినా మాకు ఒక్కొక్క అభ్యర్థికి 22 మంది బలం ఉంది. - లెక్క ప్రకారం మాకు మొత్తం 7 స్థానాలు రావాలి.. - అలా రాకుండా పోయాయి అంటే చంద్రబాబునాయుడు ప్రలోభాలకు దిగారని అర్థం చేసుకోవాలి - వారం రోజులుగా ఆయన చేస్తున్న ప్రయత్నాలు చూస్తున్నాం - ప్రలోభపెట్టడం అంటే ఇక డబ్బులు తప్ప ఏమీ లేదు..కొనుగోలు చేశారు - ఎప్పుడూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు అలాంటి చర్యలకు వెళ్లలేదు... - చంద్రబాబు చరిత్ర మొత్తం చూస్తే ప్రలోభాలే కన్పిస్తాయి - దాంట్లో చంద్రబాబు ప్రపంచ ఛాంపియన్, నేషనల్ ఛాంపియన్ అన్నా మాకేం అభ్యంతరం లేదు - ఆ విషయంలో జగన్మోహన్రెడ్డి గారు, మా పార్టీ ఆయనతో పోటీ పడలేం.. - ప్రజలకు సంబంధించినంత వరకు ఎప్పుడైనా జగన్ గారిని దాటుకుని ఆయన వెళ్లలేడు జరిగిన దానికి మేం కాదు...చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలి: - పోటీలో దిగాం కాబట్టి మేం ప్రయత్నం చేశాం..అందర్నీ పిలిచి మాట్లాడాం..మావైపు నుంచి చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేశాం - అక్కడ డబ్బు పనిచేసినప్పుడు.. దాని మీద మేం సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు...చంద్రబాబే సంజాయిషీ ఇవ్వాలి - ముందు తెలియదు కానీ...మీడియాలో వచ్చిన దాన్ని బట్టి ఎవరైనా అసంతృప్తిగా ఉన్నారని తెలిస్తే వారితో మాట్లాడాం - చంద్రబాబు ఏమైనా 175 స్థానాల్లో గెలవగలం అనే నమ్మకాన్ని కల్పించాడా..? ఏ నమ్మకంతో వారు అటువైపు వెళ్లారంటే, అందుకు బలమైన కారణం డబ్బే - శుభం...చంద్రబాబునాయుడు గారు శాశ్వతంగా 23 స్థానాలు రావని ఆయనే ఒప్పుకుంటున్నాడు - 23 వారికి అచ్చొచ్చిన ఫిగర్ అయితే ఆయన్ని కంగ్రాట్స్ చేస్తున్నాం - అన్ని వర్గాల ప్రజలు జగన్ గారు చేపట్టిన సంస్కరణలు అందుకుంటున్నారు. - కాబట్టి మేం చాలా నమ్మకంతో ఉన్నాం...175కు 175 గెలుస్తాం..దానికి దీనికి అసలు సంబంధం లేదు బాబుకి ఒకటే ప్రశ్న...175 స్థానాలకి ఎందుకు పోటీ చేయలేకున్నావ్..? - చంద్రబాబుకు నాది ఒకటే ప్రశ్న...175 స్థానాలకి ఎందుకు పోటీ చేయలేకున్నావ్..? - నిజంగా చంద్రబాబు దీన్ని చూసి బలపడ్డామనుకుంటే 175కు ఎందుకు పోటీ చేయలేకున్నాడు..? - ఏ పార్టీ అయినా.. వారి విధానాలు, వారి మేనిఫెస్టోలో ఇది చెప్పాం.. ఇది చేశాం అని వెళ్లడం కరెక్టా..? లేక పదిమందిని కలుపుకుని అధికారం కోసం, అడ్డదారులు తొక్కి ఓట్లు వేయమనడం కరెక్టా..? - తెలుగుదేశం పార్టీ 175 స్థానాలకు పోటీ చేస్తాం అంటే... అలాంటి నమ్మకాన్ని ఈ గెలుపు ఆయనకు ఇస్తే సంతోషం - గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో వారికి వచ్చిన సీట్లను చూసి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు ఇంకా ఎందుకు అధికారంలో ఉన్నారన్నట్లు మాట్లాడుతున్నారు - చివరికి వారి ప్రమాణ స్వీకారానికి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారిని పిలవాలి అనేంత వరకూ పగటి కలలు కంటున్నారు - ఇప్పుడు ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి తీసుకోవడం మరీ అన్యాయం - వారికి లేని నంబర్ 23 ఎలా వచ్చాయి..? - నలుగురు మీతో లేరు...పొద్దున లేచినప్పటి నుంచీ నిన్ను తిడుతూనే ఉన్నారు...జగన్ గారితో ఉన్నామని చెప్తున్నారు - అలాంటప్పుడు 19మంది ఉన్న నీకు 23 ఓట్లు ఎలా వచ్చాయి..? కచ్చితంగా ప్రలోభపెట్టాడు - అప్పుడు 23 మందిని కూడా అలానే తీసుకున్నాడు ...బాబుకు తెలిసిన రాజకీయం అది - ఆ విద్యలో బాబుతో పోటీ పడటం లేం అని మేం మళ్లీ చెప్తున్నాం.. ఎవరో గుర్తించాం..సరైన సమయంలో సరైన నిర్ణయం: - ఇది రాజకీయ పార్టీ...ఉద్యోగం కాదు పీకేయడానికి..విప్ చెల్లదు..ఉంటే బాగుండేది - మేం వాళ్లని గమనించినా.. అది ఇంటర్నల్ విషయం..సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాం - బలం లేకుండా బరిలో దిగిన వారు ప్రలోభాలు పెట్టి ఉంటారా..? మా బలం మాకుండీ..అందులోనూ ఇద్దర్ని లెక్కలోకి వేసుకోకపోయినా మాకు బలం ఉంటే మేం ప్రలోభపెడతామా..? - వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి చరిత్ర చూస్తే ఆ రోజు 23 మంది వెళ్తున్నప్పుడు కూడా శుభం.. వెళ్లమనే చెప్పారు.. - ఈ రోజు కూడా అదే అంటాం.. ఉన్నవాళ్లకి గౌరవం ఉంటుంది...కుటుంబంలా చూసుకుంటాం - వారి వారి ఆశలతో ప్రలోభాలకు గురైతే అది వారిష్టం..ఇది ప్రజాస్వామ్యం - అసంతృప్తి అనేది ఏముంది..? ఇది పొలిటికల్ పార్టీ. - ఇష్టమైన వాళ్లు జగన్ గారితో ఉంటారు...ఆయన విధానాలు నచ్చిన వారు ఉంటారు - కొంత మంది ఏదో ఆశించి ఏదో రావాలి అనుకుని రాలేదని పక్కచూపులు చూస్తుండవచ్చు - మాకు ఇక్కడ స్థానం లేదనుకుని, టీడీపీలో మాదిరిగా దోచుకోవడానికి, దాచుకోవడానికి అవకాశం లేదనుకున్న వారు వెళ్తారు - తగిన చర్యలు తగిన రకంగా... తగిన సమయంలో ఉంటాయి - ప్రత్యేకంగా మీకు లంచం ఇస్తాం ఉండండి అని చెప్పే వ్యక్తి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు కాదు కాబట్టి ఆయన ఆ పని చేయరు - మాట్లాడిన వారిలో చాలా మంది ఉన్నారు...వారిలో అందర్నీ అనుమానిస్తామనడం సరికాదు - మేం గుర్తించడం కోసం ఒక మెకానిజం పెట్టుకున్నాం..ఎవరెవరు క్రాస్ ఓటింగ్ వేశారు అనేది తెలిసింది - తెలిసిన తర్వాత సరైన సమయంలో..సరైన నిర్ణయం ఉంటుంది.