పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నాం..

వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి  

అన్ని ప్రాంతాల అభివృద్ధి మా ప్రభుత్వ విధానం.

విశాఖ... పరిపాలన రాజధానిగా ఉంటుంది..

 అమరావతిలో అసెంబ్లీ ఉంటుంది...

 కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుంది..

తాడేప‌ల్లి:  రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల అభివృద్ధి తమ ప్రభుత్వ విధాన‌మ‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి,  ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. పాల‌నా వికేంద్రీక‌ర‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉన్నామ‌ని స్ప‌ష్టం చేశారు. సీఎం క్యాంపు కార్యాల‌యం వ‌ద్ద స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు.   విశాఖ.. పరిపాలన రాజధానిగా ఉంటుందని, అమరావతిలో అసెంబ్లీ, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందన్నారు. పాలనా వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామని ఆయన స్పష్టం చేశారు. సీఎం వైయ‌స్ జ‌గ‌న్ అమ‌లు చేసిన సంక్షేమ ప‌థ‌కాలు, అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌తో పాటు మూడు రాజధానుల నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామన్నారు . 

 వికేంద్రీకరణకే మేం కట్టుబడి ఉన్నాంః
- ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు రాజధానిని ఒకే చోట కేంద్రీకృతం చేశారు
- విభజన తర్వాత కూడా చంద్రబాబు పరిపాలనలో కూడా శాసన, న్యాయ, పరిపాలన రాజధానులన్నీ ఒకే చోట పెట్టి దానికి అమరావతి అని నామకరణం చేశారు
- జగన్మోహన్‌రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత అన్ని ప్రాంతాల ప్రజల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకున్నారు.
- మారుతున్న కాలానికి అనుగుణంగా వికేంద్రీకరణ రాష్ట్రానికి అవసరం అని గుర్తించాం. వికేంద్రీకరణకే మేం కట్టుబడి ఉన్నాం. 
- పరిపాలనను వికేంద్రీకరణ చేయడంలో భాగంగా ప్రధాన విభాగాలు మూడింటిని మూడు ప్రాంతాలో పెట్టాలని బిల్లు తీసుకొచ్చాం.
- అది ఇప్పుడు కోర్టు పరిధిలో ఉంది. మేము మా వాదనలు వినిపిస్తున్నాం.

కన్ఫ్యూజన్ సృష్టిస్తున్నది ఎల్లో మీడియానే..:
- నిన్న మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ చెప్పింది కూడా వికేంద్రీకరణ గురించే .
- ఎల్లో మీడియా ఆయన మాటలను వక్రీకరించి, ఈరోజు ఆ పత్రికల్లో వచ్చిన బ్యానర్ వార్తలు చూస్తే..  ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ సృష్టించే ప్రయత్నం చేశారు.
- పరిపాల వికేంద్రీకరణలో భాగంగా.. మంత్రి వర్గం, సెక్రటేరియట్, ముఖ్యమంత్రి కార్యాలయం విశాఖలో ఉంటుంది.
- అసెంబ్లీ అమరావతిలోనే ఉంటుంది..హైకోర్టు, న్యాయ సముదాయాలు కర్నూలులో ఉంటాయి
- వాటిని క్యాపిటల్‌ అనేది మేమిచ్చుకున్న నిర్వచనం...ఇందులో వైరుధ్యం ఏమీ లేదు
- సుప్రీంలో మేం వాదించేది కూడా అదే. ఇంకా అందరి సూచనలు తీసుకుంటాం
- వికేంద్రీకరణకు చట్టరూపం ఇవ్వాల్సి వచ్చినప్పుడు కూడా మా విధానంలో మార్పు ఉండదు
- అందులో భాగంగా ప్రధాన వ్యవస్థలను మూడు ప్రాంతాల్లో పెట్టడానికి మేం కట్టుబడి ఉన్నాం
- కింది స్థాయిలో గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థను ముఖ్యమంత్రి గారు ప్రజలు గడప వద్దకే తీసుకెళ్లారు
- పాలన వికేంద్రీకరణలో భాగంగానే 13 జిల్లాలు... 26 జిల్లాలు అయ్యాయి.

బుగ్గన మాటలను ఎల్లో మీడియా వక్రీకరించింది:
- ఉన్నతమైన చట్టసభ ఇక్కడే ఉంటుంది... దానిని మేం రాజధాని అంటున్నాం. అది శాసన రాజధాని
- ఈ రాష్ట్రానికి సంబంధించినంతవరకు అత్యున్నతమైనది శాసన వ్యవస్థ.. అంటే, అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయి
- దానిని మీరు శాసన రాజధాని అని పిలిస్తే ఓకే..పిలిచినా పిలవకపోయినా  అసెంబ్లీ, మండలి ఇక్కడే ఉంటాయి
- దాని వల్ల కీలకమైన శాసన వ్యవస్థ ఇక్కడ పెట్టడం వల్ల,  మా ఆకాంక్షను గౌరవించారనే సంతృప్తి ఇక్కడ వారికి ఉంటుంది
- బుగ్గన రాజేంద్రనాథ్‌ పోలికలో బెంచ్‌ అన్నారు.. కర్నాటకలో హైకోర్టు ఒక చోట ఉంటే బెంచ్‌ మరొక చోట ఉంటుంది కదా అని అన్నారు
- బుగ్గన ప్రసంగం మొత్తంలో ఎటువంటి వివాదాస్పదం లేదు.. ఆయన మాట్లాడినదానిని ఎల్లో మీడియా వక్రీకరించి పైశాచిక ఆనందం పొందాలనే తపనతో రాసిన రాతలే అవి.
- ప్రజల్లో ఒక గందరగోళం సృష్టించాలనే భావనతో అలా రాసి ఉంటారు
- బుగ్గన చెప్పిన దాంట్లో ఎటువంటి గందరగోళానికి అవకాశం లేదు..
- ముఖ్యమంత్రి గారు ఒక చోట ఉంటే.. మిగతావి వేరే చోట ఉంటాయనే చెప్పారు
- కానీ హైకోర్టు కర్నూలులో వస్తుంది... బెంచ్‌ మరో చోట వస్తుంది
- "మిగిలిన ప్రాంతాలకు రాజధాని ఇవ్వడం లేదు...  వైజాగ్‌ కు రాజధాని వెళ్లిపోతుంది" అని చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తుంది.
- "మా అమరావతిలోనే అన్నీ ఉంటాయి.. రాజధాని ఎక్కడకూ వెళ్లదు" అని చెప్పే ప్రయత్నం ఎల్లో మీడియా చేస్తోంది
- ప్రభుత్వంలోనే ఏకాభిప్రాయం లేదని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు
- ఎవరైతే అమరావతిలోనే రాజధాని ఉండాలి.. ఇక్కడి మా రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం బాగుండాలని కోరుకుంటున్నారో వాళ్ళే ఇలాంటి వాదనలు చేస్తున్నారు

అస్పష్టతకు అవకాశం లేనేలేదు.. మా విధానం వికేంద్రీకరణే:
- వికేంద్రీకరణ విషయంలో ఎటువంటి అస్పష్టతకు అసలు అవకాశమే లేదు...దానికి ఏ పేరు పెట్టినా వికేంద్రీకరణ మాత్రం తథ్యం
- ఆ రోజు అసెంబ్లీలో జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన ప్రసంగంలో కానీ, మేం పెట్టిన బిల్లు కానీ వికేంద్రీకరణే మా ధ్యేయం అని చెప్పాం
- ఈ ప్రభుత్వం చేసిన చట్టంలోగానీ..మేం ఇస్తున్న హామీల్లో కానీ ఇదే స్పష్టంగా కన్పిస్తుంది
- అన్నిటి కంటే ముఖ్యంగా సుప్రీం కోర్టులో మా వాదన కానీ, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ చెప్తున్న విషయాల్లో కానీ వికేంద్రీకరణే ప్రధానం అవుతుంది
- మేం ప్రజలకు చెప్పేది మాత్రం ఒకటే.. ఎల్లో మీడియా, టీడీపీ కలిసి చేసే గందరగోళాన్ని నమ్మొద్దు...
- పరిపాలన రాజధాని విశాఖలో ఉంటుంది...శాసన రాజధాని అమరావతిలో ఉంటుంది..న్యాయ రాజధాని కర్నూలులో ఉంటుంది..ఇదే వాస్తవం
- గతంలోనూ ఎల్లో మీడియాలో... ఎ క్యాపిటలా...ది క్యాపిటలా.. అని చర్చ చేసినట్లు, ఆ చట్టంలో ఏముందంటూ కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్లు.. ఇవన్నీ వీళ్లు క్రియేట్‌ చేసే అపోహలే తప్ప,  వాస్తవాలు కావు
- వాటిని గురించి ఎవరూ అస్పష్టతకు గురికావద్దు..అపోహలకు గురికావద్దు
- ఎల్లో మీడియా ఈ రోజు అనవసర రాద్దాంతం చేయాలనే ప్రయత్నం చేసింది

కోర్టులకు వెళ్ళి అడ్డుకోకుండా ఉంటే.. వికేంద్రీకరణ ఎప్పుడో జరిగేది:
- ఎన్నికలకు వెళ్లడం కోసం మూడు రాజధానుల అంశాన్ని మేము తెరమీదకు  తీసుకురాలేదు.. మొదటి నుంచీ మా విధానం వికేంద్రీకరణ. అందులో భాగంగానే, మేము అధికారంలోకి వచ్చాక,  ఆ విధానాన్ని అసెంబ్లీలో పెట్టాం. వీళ్లే కోర్టులకు వెళ్లి, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ,  వికేంద్రీకరణను అడ్డుకుంటూ ఆలస్యం చేశారు
- లేదంటూ ఈ పాటికి వికేంద్రీకరణ జరిగి ఉండేది...
- ఖచ్చితంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వికేంద్రీకరణ నినాదంతో ఎన్నికలకు వెళ్తుంది..దానికి ప్రజల ఆదరణ కూడా ఉంది
- వికేంద్రీకరణకు ప్రజల్లో ఆదరణ ఉంది కాబట్టే.. అమరావతి రైతుల పేరుతో చేసిన పాదయాత్రకు కోర్టు అనుమతించినా, వారు మధ్యలోనే ఆపేశారు..వెనక్కి వచ్చారు
- ఇదొక్క నినాదంతోనే ఎన్నికలకు వెళ్లం...  జగన్మోహన్‌రెడ్డి గారు చేసిన పనులు చాలా ఉన్నాయి.. అందులో వికేంద్రీకరణ కూడా ఒక భాగం
- జనసేన మోస్తున్న చంద్రబాబులా.. ఎన్నికల కోసం ఒక నినాదం.. తర్వాత మరోక నినాదాన్ని జగన్మోహన్‌రెడ్డి గారు నమ్ముకుని లేరు.

అమరావతే ఏకైక రాజధాని అనడం చంద్రబాబు చేసిన ఘోర తప్పిదం:
- అమరావతి రాజధాని పేరుతో రాజకీయం చేస్తున్నది వాళ్లే...కచ్చితంగా రాష్ట్ర ప్రజలు ఈ కుట్ర రాజకీయాలకు తగిన బుద్ధి చెప్తారు
- ఎన్నిసార్లు తిరగేసి చెప్పినా చంద్రబాబునాయుడు చేసిన ఘోర తప్పిదం అమరావతి అనే ఒకే ఒక్క  రాజధానిని ఎంపిక చేయడం
- మారుతున్న కాలానికి తగినట్లు, శివరామకృష్ణన్‌ కమిటీ చెప్పినట్లు అభివృద్ధినంతా ఒకేచోట కేంద్రీకరణ చేయవద్దని చెప్పినా చంద్రబాబు వినలేదు
- హైదరాబాద్‌ లాంటి ఏకైక రాజధాని విషయం నుంచి గుణపాఠాలు నేర్చుకోవాలని ఆ కమిటీ స్పష్టంగా చెప్పింది
- వికేంద్రీకరణ చేయండి...ఎక్కువ పంటలు పండే ప్రాంతమైన అమరావతిలో రాజధాని వద్దని కూడా శివరామకృష్ణన్ కమిటీ చెప్పింది
- ఇక్కడ రాజధాని నిర్మాణం చేయాలంటే ఖర్చు ఎక్కువ అవుతుందనే సలహా కూడా వాళ్లు ఇచ్చారు
- అత్యంత సంకుచితమైన వారి ప్రయోజనాల కోసం, రాజధాని పేరుతో లక్ష కోట్లు ఎలా సంపాదించుకోవాలనే రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారిలా చంద్రబాబు ఆలోచించాడు.
- ఆయనకు ప్రజలు ఇచ్చిన ఐదేళ్ల తీర్పును దుర్వినియోగం చేశాడు..
- దాన్ని సరిచేయడం కోసం జగన్మోహన్‌రెడ్డి  గారు ఒక నిర్మాణాత్మక ప్రయత్నం చేస్తున్నారు

వైయ‌స్ జ‌గ‌న్ గారి మాటే...మా మాట:
- మాది ఒకే రాజధాని అని ఎవరైనా అంటే అప్పుడు ప్రజల్లో గందరగోళం ఏర్పడుతుంది. 
- వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు చేసిన ప్రతిపాదనలనే పై నుంచి కిందిస్థాయి వరకూ అందరూ చెప్తున్నారు
- ఈ మూడు వ్యవస్థలు ఒకే చోట ఉండటానికి, అవి మూడు ప్రాంతాల్లో ఉండటానికి తేడా లేదంటే ఎలా..?
- మూడు ప్రాంతాలను గౌరవించినప్పుడు అది వికేంద్రీకరణలో భాగం కాకుండా ఎలా ఉంటుంది..?
- ఇవన్నీ ఒకే చోట ఉంటాయని ఎవరైనా అంటే ఆలోచించవచ్చు..మా వాళ్లు ఎవరూ అలా అనడం లేదు కదా
- శాసన వ్యవస్థకు సంబంధించిన కార్యాలయాలన్నీ ఇక్కడే ఉంటాయి అన్న తర్వాత అసెంబ్లీ సమావేశాలు ఇక్కడ జరగక వేరే చోట ఎలా జరుగుతాయి..?
- శాసన సభ సమావేశాలు ఇక్కడే జరుగుతాయి అన్న తర్వాత దాంట్లో సందిగ్ధతకు తావు లేదు
- ఒక సెక్షన్‌ ఆఫ్‌ మీడియా సందిగ్ధత లేని చోట సందిగ్ధత క్రియేట్‌ చేయాలని చూస్తోంది..అది తప్పు

 సుప్రీం కోర్టు తీర్పును అనుసరించే విశాఖకు వెళ్తాం:
-  విశాఖకు వెళ్ళేది సిఎం గారి క్యాంపు కార్యాలయమా..? మొత్తం వ్యవస్థా.. అన్నది కోర్టు తీర్పుకు లోబడే ఉంటుంది
- ఎవర్నో మోసం చేసి అడ్డంగా వెళ్లాల్సిన అవసరం కూడా లేదు
- రాజ్యాంగంప్రకారం చూసినా రాజధాని ఎక్కడ ఉండాలనేది, పరిపాలన ఎక్కడ్నుంచి చేయాలి అనేది కచ్చితంగా ఆ రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం
- రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కాబట్టే ఆనాడు చంద్రబాబు అమరావతి అన్నాడు
- పదేళ్లు హైదరాబాద్‌లో అవకాశం ఉన్నా ఓటుకు నోటు కేసు వల్ల హడావుడిగా అర్ధరాత్రి అమరావతికి వచ్చాడు
- అమరావతిపై..  పది రోజుల కమిటీ అయిన నారాయణ కమిటీ వేసి, దాని నుంచి నివేదిక తీసుకున్నాడు
- వికేంద్రీకరణ దిశగా కేంద్రం నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ సిఫార్సులను లెక్కచేయకుండా పక్కకు తోసేశారు
- ఎవరితో చర్చించకుండా తనంతట తానుగా ఏకపక్షంగా అమరావతిని డిక్లేర్‌ చేసుకున్నాడు
- ఆ రోజు జగన్మోహన్‌రెడ్డి గారు ఎక్కడ రాజధాని పెట్టినా 30 వేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంటే బాగుంటుందని సలహా ఇచ్చారు
- అది రాష్ట్రప్రభుత్వ నిర్ణయం కాబట్టే మేం సలహా మాత్రమే ఇవ్వగలిగాం
- అదే ఇప్పటికీ వర్తిస్తుంది...చంద్రబాబు రాజధాని అంతా పూర్తి చేసి ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదేమో తెలియదు
- రాజధాని నిర్మాణానికి చంద్రబాబు పెట్టిన ప్రతిపాదనలు చూస్తే రెండు మూడు బడ్జెట్లు కూడా సరిపోవు. దాని నిర్మాణానికి కనీసం ఇరవై ఏళ్లకు పైగా సమయం పట్టేది.
- మౌలిక వసతులు కల్పించకపోతే అక్కడ రాజధాని అనేది ఊహకు కూడా అందని విషయం
- అమరావతి రాజధాని నిర్మాణ వ్యయమే లక్ష కోట్లు అని ఆయనే లెక్కవేసిన నేపథ్యంలో...దాన్ని భరించే పరిస్థితి రాష్ట్రానికి లేనప్పుడు వికేంద్రీకరణ నిర్ణయం తీసుకున్నాం
- ఆ రాజధానికి పెట్టాల్సిన ఖర్చు వడ్డీతో కలిపితే 5 లక్షలు కోట్లు అవుతుంది
- అక్కడ కుంభకోణాలన్నీ కళ్లముందు కన్పిస్తున్నప్పుడు.. మరో వైపు ప్రజల చిరకాల ఆకాంక్షలను దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్‌రెడ్డి గారు వికేంద్రీకరణ కోసం సరైన నిర్ణయం తీసుకున్నారు
- అందుకే వికేంద్రీకరణపై ప్రజల్లో పెద్ద ఎత్తున మద్దతు వస్తోంది..దీనిలో మేము పంతానికి వెళ్లి చేస్తున్నది ఏమీ లేదు

విశాఖపై టీడీపీకి ఎందుకు కడుపు మంట..?
- మేం పదే పదే రాజధానుల గురించి మాట్లాడటం లేదు...వాళ్లే రోజూ మాట్లాడుతున్నారు
- మొన్న కిషన్‌ రెడ్డి వద్దకు వెళ్లారు..పాదయాత్ర అంటూ కారేసుకుని ఒకాయన, దేవాలయ యాత్రకు వెళ్ళాడు.
- అమరావతే మా రాజధాని అంటూ రాష్ట్రమంతా అదే కోరుకుంటుందని టీడీపీ, ఎల్లో మీడియా చెప్పే ప్రయత్నాన్ని తిప్పికొట్టేందుకే మేం మాట్లాడుతున్నాం
- విశాఖకు ఉన్న పొటెన్షియల్‌ ఎలాగూ ఉంది..రాజధాని అయితే అదనపు అవకాశం అవుతుంది
- ముఖ్యమంత్రి గారు అక్కడ ఉంటారు కాబట్టి ఇంకా పరిశ్రమల స్థాపనకు మార్గం సుగమం అవుతుందని సీఎం గారు చెప్పారు. 
- విశాఖ అనేది ఏమైనా ఒడిశాలో ఉందా..?. విశాఖలో పరిపాలనా రాజధాని వస్తే... టీడీపీకి బాధేంటో నాకర్ధం కావడం లేదు
- పరిశ్రమలన్నీ విశాఖకు వస్తే వీళ్లకు ఎందుకంత కడుపుమంట..రావద్దనుకుంటున్నారా..?
- అక్కడ పోర్ట్‌ ఉంది... కోస్టల్‌ లైన్‌ ఉంది...క్యాపిటల్‌ ఉంది..పవర్‌ సెంటర్‌ అక్కడ ఉంటే పారిశ్రామిక వేత్తలకు వెసులుబాటు ఉంటుంది
- ఇన్వెస్టర్లను ఎట్రాక్ట్‌ చేయడానికి ఉన్న అవకాశాలన్నిటినీ మేం వాడుకుంటాం
- అందులో తప్పేముంది..టీడీపీకి బాధేంటి.? పరిశ్రమలు రాకూడదనా...?
- వాళ్ల కడుపు మంటను బయటపెట్టుకోవడం తప్ప.. వాళ్ళకు రాష్ట్రం మీద ప్రేమ మాత్రం కన్పించడం లేదు
- కేంద్రం కూడా రాజధాని ఎంపిక నిర్ణయం అన్నది  పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే అన్న మాటను మాత్రం టీడీపీ- ఎల్లో మీడియా చెప్పడం లేదు
- రేపు కోర్టులో కూడా అదే ఉంటుందని మేం ఆశిస్తున్నాం
- రాష్ట్ర ప్రభుత్వం ఎక్కడ కూర్చోవాలి అనేది రాష్ట్రం నిర్ణయించుకుంటుంది కానీ కేంద్రం కాదు కదా..
- ఒక వేళ కేంద్రమే చేయాల్సి వస్తే..  దానికి కావాల్సిన లక్ష కోట్లు వాళ్లిస్తారా..?
- రాజ్యాంగ పరంగా కూడా అది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే...సమాఖ్య వ్యవస్థలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయమే ఫైనల్‌ అవుతుంది.

Back to Top