విజయవాడ: నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖలపై ఉన్నతాధికారులతో ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీల పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. నైపుణ్యశాఖ లక్ష్యం, ఉద్దేశాలను అధికారులకు వివరించారు. పాలిటెక్నిక్ కాలేజీల్లో కోర్సులు, శిక్షణ అంశాలను మంత్రి గౌతమ్రెడ్డికి అధికారులు వివరించారు.