ఎమ్మెల్సీలుగా పెనుమత్స సురేష్, జాకీయా ప్ర‌మాణ‌స్వీకారం

అసెంబ్లీ: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ శాసనమండలి సభ్యులుగా పెనుమత్స సురేష్, జకీయా ఖానుమ్‌ ప్రమాణ స్వీకారం చేశారు. మండలి చైర్మన్‌ షరీఫ్‌ వీరితో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమానికి డిప్యూటీ సీఎంలు పుష్ప శ్రీవాణి, అంజాద్‌ భాషా, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకకృష్ణారెడ్డి, ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌ రెడ్డి హాజరయ్యారు. 

పార్టీని నమ్ముకున్న వారికి ప్రాధాన్యం: ప్రభుత్వ సలహాదారు సజ్జల
సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఎమ్మెల్సీల ఎంపికలో ప్రత్యేక శైలి పాటించారని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. చరిత్రలో తొలిసారి మైనార్టీ మహిళ జకీయా ఖానుమ్‌ను శాసన మండలికి పంపారన్నారు. సీఎం వైయస్‌ జగన్‌తో తొలి రోజు నుంచి వెన్నంటే ఉన్న పెనుమత్స సాంబశివరాజు కుమారుడు పెనుమత్స సురేష్‌కి అవకాశం ఇచ్చారని గుర్తుచేశారు.పార్టీని నమ్ముకున్న వారికి సీఎం వైయస్‌ జగన్‌ ప్రాధాన్యం ఇచ్చారని ఇద్దరి ఎంపిక రుజువు చేసిందన్నారు.   
 

Back to Top