కోడుమూరులో బస్సుయాత్రకు బ్రహ్మరథంమూడో రోజు `మేమంతా సిద్ధం` బస్సుయాత్ర ప్రారంభంకర్నూలు జిల్లా సిద్ధమా…?చంద్రబాబు ఒక్క హామీ అయినా నెరవేర్చాడా?మేమంతా సిద్ధం 3వ రోజు షెడ్యూల్మానవాళి కోసం కరుణామయుని మహాత్యాగమే గుడ్ ఫ్రైడే సందేశంరాజకీయాల్లో ఉన్నంతవరకు జగనన్నతోనే ఉంటాంఈ ఎన్నికలు మంచి చేసిన మనకు ఓ జైత్రయాత్ర..బాబుకు చివరివికొల్లు రవీంద్ర సిగ్గు శరం లేకుండా అబద్ధాలు చెబుతాడుచంద్రబాబు నకిలీ కరెన్సీ వంటి వ్యక్తి
రేపు ‘నివర్’ పరిహారం, రైతు భరోసా సాయం విడుదల
28 Dec 2020 5:59 PM
రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్న సీఎం వైయస్ జగన్
తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ రైతులకు సంక్రాంతి పండుగ ముందే వచ్చింది. అసెంబ్లీలో చెప్పిన మాట ప్రకారం.. నివర్ తుపాన్ బాధిత రైతులకు పంటనష్ట పరిహారాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి రేపు విడుదల చేయనున్నారు. అదే విధంగా వైయస్ఆర్ రైతు భరోసా మూడో విడత సాయం కూడా రైతులకు చెల్లించనున్నారు. నివర్ పరిహారంతో వైయస్ఆర్ రైతు భరోసా సాయాన్ని రైతుల బ్యాంకు ఖాతాల్లోకి సీఎం వైయస్ జగన్ బదిలీ చేయనున్నారు. రైతు భరోసా మూడో విడత సాయంగా రూ.1,120 కోట్లను 51.59 లక్షల మంది రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. అదే విధంగా నివర్ తుపాన్ కారణంగా 12.01 లక్షల ఎకరాల్లో పంట నష్టపోయిన రైతులకు రూ.646 కోట్ల పరిహారాన్ని బాధిత రైతుల ఖాతాల్లోకి జమ చేయనున్నారు. చరిత్రలో ఎన్నడూ లేనంత వేగంగా తుపాన్ బాధితులకు సీఎం వైయస్ జగన్ పరిహారం అందిస్తున్నారు.