వైయస్‌ జగన్‌ను కలిసిన ముస్లిం నాయకులు, వక్ఫ్‌ మాజీ సభ్యులు 

 తాడేప‌ల్లి:  వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి  వైయస్‌ జగన్‌ను  ముస్లిం నాయకులు, వక్ఫ్‌ మాజీ సభ్యులు క‌లిశారు. వక్ఫ్‌ బిల్లుకు వ్యతిరేకంగా పార్లమెంట్‌ ఉభయసభల్లో వైయ‌స్ఆర్‌సీపీ ఓటు వేసినందుకు వైయస్‌ జగన్‌కు హజ్‌ కమిటీ మాజీ ఛైర్మన్‌ బీఎస్‌ గౌస్‌లాజమ్‌, ఎమ్మెల్సీ ఇసాక్‌ బాషా త‌దిత‌రులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు. ముస్లిం, మైనార్టీలకు వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.

 వైయస్‌ జగన్‌ను కలిసిన వారిలో ముస్లిం నాయకులు కాగజ్‌ ఘర్‌ రిజ్వాన్‌ (అనంతపురం), మదీనా దస్తగిర్‌ (వైఎస్సార్‌ కడప), మీరాన్‌ (నెల్లూరు), గౌస్‌ మొయిద్దిన్‌ (ఎన్‌టీఆర్‌ జిల్లా), అబ్దుల్‌ ఖాదర్‌ (అమలాపురం జిల్లా), డీఏ జమా (ఏలూరు జిల్లా), రెహ్మాన్‌ ఖాన్‌ (కాకినాడ),ఇమ్రాన్‌ (హజ్‌ కమిటీ ఎక్స్‌ మెంబర్‌), నిజాం (ఎంఎఫ్‌సీ ఎక్స్‌ డైరెక్టర్‌) ఉన్నారు.

Back to Top