ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నారా లోకేశ్.. ఇదే చంద్రబాబు స్కెచ్

వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి 
 

అమరావతి:  నారా లోకేశ్ ను ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా నియమించేలా  చంద్రబాబు స్కెచ్ వేశారని వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి ఆరోపించారు.  అందుకే, ముందు నుంచి బీజేపీ జెండా మోస్తున్నవారిని ఎదగనీయకుండా చంద్రబాబు అడ్డుకున్నారని పేర్కొన్నారు. తెలంగాణ కాంగ్రెస్ లోకి తన నమ్మకస్తులను టీడీపీ అధినేత చంద్రబాబు పంపించారని... తద్వారా ఆ పార్టీని తన కంట్రోల్ లోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. మరోవైపు, ఏపీలో తన పార్టీని బీజేపీలో విలీనం చేసేందుకు యత్నిస్తున్నారని చెప్పారు. ఈ మేరకు విజయసాయిరెడ్డి ట్వీట్‌ చేశారు.

Read Also: సీపెట్‌ భవనం ప్రారంభం 

Back to Top