ఎల్లో మీడియా నాటి టెక్నిక్‌నే న‌మ్ముకుంది

వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి విజ‌య‌సాయిరెడ్డి

తాడేప‌ల్లి: ప‌్ర‌తిప‌క్ష నేత చంద్ర‌బాబు ఎల్లో మీడియాను ఉప‌యోగించుకొని చేస్తున్న త‌ప్పుడు ప్ర‌చారాన్ని వైయ‌స్ఆర్‌సీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి, ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి తీవ్రంగా ఖండించారు.  ఈ మేర‌కు ఆదివారం ఆయ‌న ట్వీట్ చేశారు. ఈర్శ, ద్వేషాలతో రగిలి పోయేవారు ఎవర్నైనా అప్రతిష్ట పాల్జేయాలంటే ఒకప్పుడు ఆకాశరామన్న పేరుతో కరపత్రాలు వేయించి వదిలేవారు. కొందరు నిజమేనని నమ్మే పరిస్థితి ఉండేది. ఇప్పుడంత అజ్ఞానం ఎవరికీ లేదు. అయినా, ఎల్లో మీడియా 40-50 ఏళ్ల క్రితం నాటి కరపత్రాల టెక్నిక్ నే నమ్ముకుంది ఇప్పటికీ అంటూ విజ‌య‌సాయిరెడ్డి ట్వీట్‌లో పేర్కొన్నారు.

తాజా వీడియోలు

Back to Top