మాలోకానికే పెళ్లయిందిగా..వాలంటీర్లకు ఏం తక్కువ?

  ఎంపీ విజయసాయిరెడ్డి సెటైర్లు
 

 అమరావతి: వైయస్‌ఆర్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి  ఇవాళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు, నేత నారా లోకేశ్ లపై తీవ్రంగా విరుచుకుపడ్డారు. నెలకు రూ.5 వేల వేతనం అందుకునే గ్రామ వాలంటీర్లకు వివాహానికి పిల్లను కూడా ఇవ్వరని చంద్రబాబు ఎక్కసెక్కాలాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.‘అప్రయోజకుడు, అజ్ణాని, చెల్లని కాసు లాంటి మాలోకానికి పెళ్లి అవలేదా?’ అని సూటిగా ప్రశ్నించారు. లక్షలాది మందితో పోటీపడి ఉద్యోగాలు సాధించిన వాలంటీర్లకు ఏం తక్కువని చంద్రబాబు అపశకునాలు పలుకుతున్నారని మండిపడ్డారు. ఈ మేరకు ట్విట్టర్ లో  విజయసాయిరెడ్డి స్పందించారు. 

Back to Top