విశాఖపట్నం: సీఎం వైయస్ జగన్ మోహన్ రెడ్డి అందరితో చర్చించి మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారని వైయస్ఆర్సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ఎవరితో సంప్రదించాలో వారితో చర్చించి మూడు రాజధానులపై నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. శనివారం ఆయన విశాఖలో మీడియాతో మాట్లాడుతూ.. విశాఖకు పరిపాలన రాజధాని వచ్చి తీరుతుందన్నారు. కర్నూలులో హైకోర్టు పెట్టాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని చెప్పారు. కరోనా పరిస్థితులు చక్కబడ్డాకే స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయని అన్నారు. చంద్రబాబు నాయుడు జీవితమే కుట్రలమయం అని ధ్వజమెత్తారు. పోలీస్ అధికారి కింద పడిపోతే వైయస్సార్సీపీ కార్యకర్త సహాయం చేస్తే.. దాడి చేశారని చంద్రబాబు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. పోలీసులు ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా చంద్రబాబు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు మరిచిపోయారు: అవంతి శ్రీనివాస్ కేసీఆర్, వైయస్ జగన్ తమ వాదం కోసం రాజీనామాలు చేసి, తమ ఎమ్మెల్యేలు, ఎంపీలతో రాజీనామా చేయించారు. చంద్రబాబు కూడా వైయస్ జగన్ లాగే ఎమ్మెల్యేలతో రాజీనామా చేయాలన్నారు. రాజీనామాలపై వైయస్ జగన్కి ఉన్న దమ్ము, ధైర్యం చంద్రబాబుకు లేదన్నారు. అమరావతిలో తన భూములు ధరలు తగ్గిపోతాయని చంద్రబాబు భయపడుతున్నారని విమర్శించారు. చంద్రబాబును రాష్ట్ర ప్రజలు ఎప్పుడో మరిచిపోయారని అవంతి శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.