ఎవరూ ఆవేశాలకు పోవద్దు

సీఎం వైయస్‌ జగన్‌ రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారు

రాజధాని ప్రాంతంలో రైతుల దీక్షా శిబిరానికి వెళ్లిన ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు

అమరావతి:  అమరావతి రైతులు ఎవరూ ఆవేశాలకు పోవద్దని వైయస్ఆర్‌సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు సూచించారు. మందడం, వెలగపూడిలో రైతుల దీక్షా శిబిరానికి ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన రైతులతో మాట్లాడారు. సీఎం వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి రైతులకు కచ్చితంగా న్యాయం చేస్తారని చెప్పారు. రాజకీయాల్లో ఒక స్థాయికి వచ్చిన తరువాత ఏ వర్గాన్ని వ్యతిరేకం చేసుకోవాలనుకోరు. రైతులందరూ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలన్నారు. వెలగపూడి నుంచి కొందరు మహిళలు నన్ను కలిశారు. తొందరపడి ఒక నిర్ణయానికి రావొద్దు. రైతులతో చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉంది. మీతో చర్చలు జరిపేందుకు వచ్చినప్పుడు మీరు ముందుకు రావాలి. తొందరపడి ఒక మాట అంటే వెనక్కి తీసుకోవడం కష్టం.  రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Back to Top