కార్యకర్తలందరినీ సమయత్తం చేసేందుకు మేమంతా సిద్ధం బస్సు యాత్ర 27 నుంచి సీఎం వైయస్ జగన్ బస్సు యాత్రటికెట్ల కేటాయింపుతో కార్యకర్తల్లో జోష్ పెరిగింది పశ్చిమ గోదావరి జిల్లాలో వైయస్ఆర్సీపీలోకి భారీగా చేరికలుసీఎం వైయస్ జగన్పై టీడీపీ సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు ఏ ముఖం పెట్టుకొని ముగ్గురు ఒకే స్టేజిపైకి వచ్చారుఅభ్యర్థులు ప్రతి సచివాలయాన్నీ సందర్శించి ప్రజల ఆశీర్వాదం తీసుకోవాలి భారీ ప్రచారానికి వైయస్ జగన్ సిద్ధంసీఎం వైయస్ జగన్ అధ్యక్షతన పార్టీ రీజనల్ కో ఆర్డినేటర్ల సమావేశంమనం కోరుకున్న రాజ్యాధికారం సీఎం వైయస్ జగన్ వల్లే దక్కింది
పేదలు తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలా?
14 Nov 2019 6:23 PM
ఎమ్మెల్యే ఆర్కే రోజా
చిత్తూరు: ఇంగ్లీషు మీడియం చదువులను వ్యతిరేకిస్తున్న నేతలంతా తమ పిల్లలను మాత్రం ఇదే మాధ్యమంలో చదివిస్తున్నారని ఏపీఐఐసీ చైర్ పర్సన్, ఎమ్మెల్యే ఆర్కే రోజా విమర్శించారు. ఈరోజు బాలల దినోత్సవం సందర్భంగా చిత్తూరులో నిర్వహించిన కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. అనంతరం, ఆమె మీడియాతో మాట్లాడుతూ, టీడీపీ నాయకులు మాట్లాడుతున్న తీరు చూస్తుంటే చాలా బాధాకరంగా వుందని మండిపడ్డారు. ఎందుకంటే, టీడీపీ నాయకుల పిల్లలు మాత్రం ఇంగ్లీషు మీడియంలో చదువుకోవచ్చు, విదేశాలకు వెళ్లి చదువుకోవచ్చు గానీ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ పేదలు మాత్రం తెలుగు మీడియంలోనే మగ్గిపోవాలన్న ఆలోచనలోవారు ఉన్నట్టు అర్థమవుతోందని దుయ్యబట్టారు. ఇంగ్లీషు మీడియంలో తమ పిల్లలను చదివించే పవన్ కల్యాణ్, చంద్రబాబునాయుడు లాంటి వాళ్లు ‘తెలుగు’ను ఉద్ధరిస్తారా? అంటూ సెటైర్ విసిరారు. పేదపిల్లలు ఇంగ్లీషు మీడియంలో చదువుకుంటే ‘తెలుగు’ చచ్చిపోతుందనడం ఏంటో తనకు అర్థం కావట్లేదని వ్యాఖ్యానించారు. ఈరోజు ఉన్న పోటీ ప్రపంచంలో ‘ఇంగ్లీషు’ అనేది చాలా ముఖ్యం అని అభిప్రాయం వ్యక్తం చేశారు.