మేమంతా సిద్ధం - 19వ రోజు షెడ్యూల్ బాబు అభివృద్ధి ఎల్లోమీడియాలోనే.. జగన్ అభివృద్ధి ఇంటింటా..!రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేస్తే వైయస్ జగన్ మార్క్ పాలన చంద్రబాబుకు బిల్డప్ ఎక్కువ.. పని తక్కువటీడీపీ సోషల్ మీడియాపై ఈసీకి వైయస్ఆర్ సీపీ ఫిర్యాదుజన్మదిన శుభాకాంక్షలు అమ్మమంగళగిరిలో హత్యారాజకీయాలు లోకేష్ చలవే ‘తూర్పు’ కొండల్లో ఉదయించిన సూర్యుడిలాగుంటూరు వెస్ట్లో టీడీపీకి భారీ షాక్..వైయస్ఆర్సీపీలోకి కీలక నేతలునామినేషన్లు దాఖలు చేసిన వైయస్ఆర్ సీపీ అభ్యర్థులు
నిరుపేదలకు గూడు కల్పించడమే సీఎం లక్ష్యం
26 Dec 2020 3:54 PM
టీడీపీ నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారు
వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ: నిరుపేదల సొంతింటి కలను సీఎం వైయస్ జగన్ సాకారం చేశారని వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు తెలిపారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఇళ్ల పట్టాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాల్లాది విష్ణు మాట్లాడుతూ.. 21వ డివిజన్లో 478 మందికి ఇళ్ల పట్టాలు మంజూరయ్యాయన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులైన వారందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తున్నామని తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలో 30 వేల మందికి ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తున్నామని చెప్పారు. ఇల్లు లేనివారు ప్రతి మూడు నెలలకొకసారి ఇంటి కోసం పేరు నమోదు చేసుకోవచ్చని ఆయన సూచించారు. సెంట్రల్ నియోజకవర్గంలో బస్టాండ్ కూడా నిర్మిస్తున్నామని తెలిపారు. నియోజకవర్గంలో 7,210 మంది లబ్ధిదారులకు అమరావతిలో పట్టాలు సిద్ధం చేశామన్నారు.
అమరావతిలో 54 వేల మంది పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీని టీడీపీ కోర్టుకెళ్లి అడ్డుకుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు మండిపడ్డారు. టీడీపీ చేస్తున్న నీచ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారని, తీరు మార్చుకోకుంటే టీడీపీని ప్రజలు తరిమికొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. టిడ్కో ఇళ్ల విషయంలో పేదలను టీడీపీ మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 300 చదరపు అడుగుల టిడ్కో ఇంటిని ఒక్క రూపాయికే వైయస్ జగన్ సర్కార్ అందిస్తుందన్నారు. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.