బాబు, పవన్లపై ఈసీకి వైయస్ఆర్సీపీ ఫిర్యాదుకూటమి ఛార్జ్షిట్..ఛార్జింగ్ లేని పార్టీల కామెడీ షో అసత్యాలు, అబద్ధాలతో ఎన్డీఏ కూటమి ఛార్జ్షిట్బీసీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదు కూటమి నేతలు విడుదల చేసిన ఛార్జ్షిట్ అబద్దాల పుట్ట రాయలసీమ కోసం పాటు పడే పార్టీ వైయస్ఆర్ కాంగ్రెస్ మీ తండ్రి కోసం పోరాడినందుకు నాకు మీరు ఇచ్చే గౌరవం ఇదా?మంత్రి పదవుల్లో ఉన్నవాళ్లు చాలా జాగ్రత్తగా మాట్లాడాలిచంద్రబాబు నోరు తెరిస్తే అబద్ధాలేఅబద్ధపు హామీలు ఇవ్వటంలో టీడీపీ నేతలు దిట్ట
అందరూ బాగుండాలనేది మా ఆలోచన
15 Oct 2022 1:08 PM
మంత్రి విడదల రజిని
విశాఖ: రాష్ట్రంలో అందరూ బాగుండాలన్నదే మా ప్రభుత్వ ఆలోచన అని మంత్రి విడదల రజిని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్ధే సీఎం వైయస్ జగన్ ధ్యేయమన్నారు. విశాఖ గర్జన సభలో మంత్రి మాట్లాడారు.
ఉత్తరాంధ్ర ప్రజలు ఉగ్రరూపం దాల్చారు. విశాఖ గర్జన కోసం జనం ఉప్పెనలా వచ్చారు. ఉక్కు సంకల్పంతో జనం పోటెత్తారు. మూడురాజధానులకు మద్దతుగా నిలిచారు. విశాఖకు పాలనా రాజధాని కావాలని వారి మనోభావాలను తెలుసుకునేందుకు ఈ గర్జన నిర్వహించాం. అప్పుడు మద్రాస్, తర్వాత హైదరాబాద్ రాజధాని అంటే ఉత్తరాంధ్ర ప్రజలు ఓకే అన్నారు. ఇక్కడ రాజధాని రావాలని జనం భారీగా తరలివచ్చారు. రాలేని వారు టీవీల ముందు కూర్చున్నారు. మా వెనుకబాటు తనాన్ని పోగొట్టుకుంటామని మీరంతా వచ్చారు. ఈప్రాంతానికి మంచి జరగాలని జగన్ భావిస్తున్నారు. అమరావతి పేరుతో ఇక్కడికి వచ్చి ఏం సంకేతాలు ఇస్తారు.
సీఎం వైయస్ జగన్ మూడు రాజధానులు ఉండాలని ఆలోచన చేస్తున్నారు. అన్ని ప్రాంతాలు బాగుండాలని ఆకాంక్షిస్తున్నారు. అందులో అమరావతి ఉండాలి..అందరూ బాగుండాలన్నది మా ఆలోచన. చంద్రబాబు ప్రోదల్భంతో అమరావతి రైతులు పాదయాత్ర చేస్తున్నారు. ఉత్తరాంధ్ర ప్రజలు రాజధాని కావాలని ఉద్యమిస్తుంటే చంద్రబాబు ఈ ప్రాంతం గురించి ఆలోచించడం లేదు. ఉత్తరాంధ్రను మోసం చేస్తున్నారు. చంద్రబాబుకు, వాళ్ల బ్యాచ్కు వెన్నులో వణుకు పుట్టేలా ఈ గర్జనకు తరలివచ్చారు. మూడు ప్రాంతాలు అభివృద్ధి జరగాలి. అప్పుడే రాష్ట్రం సమగ్రాభివృద్ధి సాధ్యమవుతుంది. ఈ విశాఖ గర్జన ఉత్తరాంధ్ర ప్రజల ఆకాంక్ష. చంద్రబాబు కుట్రలను తిప్పికొట్టే గర్జన ఇది.