నెల్లూరు: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నవరత్నాలతో నవశకానికి నాంది పలికారని చిత్తూరు జిల్లా వైయస్ఆర్ సీపీ వ్యవహారాల ఇన్చార్జ్, టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. పార్టీలకతీతంగా సంక్షేమాన్ని అందిస్తున్న సీఎం వైయస్ జగన్ వెంటే జనం ఉన్నారన్నారు. తిరుపతి లోక్సభ ఉప ఎన్నిక ప్రచారంలో భాగంగా వెంకటగిరి నియోజకవర్గం సైదాపురంలో నిర్వహించిన ‘శంఖారావం’ బహిరంగ సభలో డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బాలినేని శ్రీనివాసరెడ్డి, టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్ రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఇంటి వద్దకే సంక్షేమాన్ని చేర్చిన ఘనత ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. తిరుపతి పార్లమెంట్ పరిధిలో విశేష స్పందన కనిపిస్తోందన్నారు. ప్రతి నియోజకవర్గంలో ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారన్నారు. స్థానిక సంస్థలకు మించిన మెజార్టీ వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తికి రాబోతోందని ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసం కోల్పోయిందని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. పల్లె, నగర పోరులో ఫలితాలు చూసి టీడీపీకి భయం పట్టుకుందన్నారు. తిరుపతి పార్లమెంట్ ఎన్నికల్లో వైయస్ఆర్ సీపీ అభ్యర్థి గురుమూర్తికి అనూహ్య మెజారిటీ వస్తుందన్నారు. రాజకీయ విలువలు లేని వ్యక్తి చంద్రబాబు అని డిప్యూటీ సీఎం నారాయణస్వామి అన్నారు. దళితులను అవమానించిన చంద్రబాబుకు బుద్ధి చెప్పాలని కోరారు. త్వరలో టీడీపీని బీజేపీలో విలీనం చేయడం ఖాయమన్నారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాస్రెడ్డి మాట్లాడుతూ.. నమ్ముకున్న వాళ్లకు న్యాయం చేసే చిత్తశుద్ధి సీఎం వైయస్ జగన్కే సొంతమన్నారు. పేదవాడి గుండె ఆపరేషన్ని కూడా రాజకీయం చేసే వక్రబుద్ధి చంద్రబాబుదన్నారు, పవన్ పెళ్లాలను మార్చినట్టే పార్టీలను మారుస్తున్నాడని దుయ్యబట్టారు.