ప్ర‌జారోగ్య ప‌రిర‌క్ష‌ణ‌కు పెద్ద‌పీట వేశాం

వైద్య, ఆరోగ్య‌రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు శ్రీ‌కారం

గుంటూరు జీజీహెచ్‌లో త్రీడీ డిజిటల్‌ మామోగ్రఫీ మెషిన్ ని ప్రారంభించిన మంత్రి విడుద‌ల ర‌జిని

గుంటూరు: ప్ర‌జారోగ్యానికి సీఎం వైయ‌స్ జ‌గ‌న్ పెద్ద‌పీట వేశార‌ని, వైద్య‌, ఆరోగ్య రంగంలో విప్ల‌వాత్మ‌క మార్పుల‌కు ముఖ్య‌మంత్రి శ్రీ‌కారం చుట్టార‌ని సంబంధిత శాఖ‌ మంత్రి విడదల రజిని అన్నారు. క్యాన్సర్‌ వ్యాధిగ్ర‌స్తుల‌కు మెరుగైన చికిత్స అందించేందుకు దేశంలోనే అత్యు­త్తమ వైద్య విధానాన్ని తీసుకొచ్చారని చెప్పారు. గుంటూరు జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌లో త్రీడీ డిజిటల్‌ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని మంత్రి విడుద‌ల ర‌జిని ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి రజిని మాట్లాడుతూ రాష్ట్రంలో ఏడాదికి 50 వేల నుంచి 60 వేల వరకు కొత్త క్యాన్సర్‌ కేసులు నమోదవుతున్నాయని, ఆరోగ్యశ్రీ ద్వారా ఉచితంగా పూర్తి వైద్యం అం­దిస్తున్నామని చెప్పారు. అన్ని ప్రభుత్వ వైద్య కళాశాలల ఆస్పత్రులను అత్యాధునిక క్యాన్సర్‌ కేర్‌ సెంటర్లుగా తీర్చిదిద్దుతున్నామన్నారు. క్యాన్సర్‌ను ముం­దుగానే గుర్తించేందుకు వైద్యులు, సిబ్బం­­దికి శిక్షణ, సాంకేతిక సహకారం కోసం విశాఖపట్నంలోని హోమీ బాబా క్యాన్సర్‌ హాస్పిటల్‌తో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుందన్నారు. 

విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి ప్రభుత్వాస్పత్రుల్లో కాంప్రహెన్సివ్‌ క్యాన్సర్‌ కేర్‌ సెంట­ర్లను అభివృద్ధి చేస్తున్నామని మంత్రి విడుద‌ల ర‌జిని చెప్పారు. కడప, కర్నూలులో రూ.120కోట్లతో రాష్ట్ర స్థాయి క్యాన్సర్‌ చికిత్స కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నా­మన్నారు. రాష్ట్రంలో ఫ్యామిలీ ఫిజిషియన్‌ వైద్య విధానాన్ని ఉగాది నుంచి పూర్తిస్థాయిలో ప్రారంభిస్తామని తెలిపారు. చంద్రబాబుకు మోసం చేయడం మాత్రమే తెలుసునని, వైద్య, ఆరోగ్య రంగానికి ఏమీ చేయని ముఖ్యమంత్రిగా బాబు చరిత్రలో నిలిచిపోతారన్నారు. రూ.కోటి విలు­వైన ఈ త్రీడీ డిజిటల్‌ మామోగ్రఫీ వైద్య పరికరాన్ని జీజీహెచ్‌ నాట్కో క్యాన్సర్‌ సెంటర్‌కు అందించిన అమృతలూరుకు చెందిన గడ్డిపాటి కస్తూరిదేవి, రామ్మోహనరావు, శివ­రామ­కృష్ణబాబు, నాట్కో ట్రస్ట్‌–హైదరాబాద్ వారిని మంత్రి అభినందించారు. ఈ కార్య‌క్ర‌మంలో ఎమ్మెల్యేలు షేక్‌ ముస్తఫా, మద్దాలి గిరి, ఉండవల్లి శ్రీదేవి, అధికారులు పాల్గొన్నారు.  

తాజా వీడియోలు

Back to Top