వైయస్ జగన్ సంక్షేమ పధకాలపై టీడీపీ దుష్ప్రచారం మరో జైత్రయాత్రకు సిద్ధం మేమంతా సిద్ధం బస్సు యాత్ర జైత్ర యాత్రగా సాగింది చంద్రబాబూ....డ్రామాలు కట్టిపెట్టు.... అ‘సామాన్యులు’ వైయస్ఆర్సీపీ అభ్యర్థులుఎంతమంది కలిసొచ్చినా వైయస్ఆర్సీపీ విజయాన్ని ఆపలేరుమాజీ ఎమ్మెల్యే, టీడీపీ సీనియర్ నేత వీరశివారెడ్డి వైయస్ఆర్సీపీలో చేరిక కర్నూలు నియోజకవర్గంలో మళ్లీ వైయస్ఆర్సీపీదే విజయం ఓట్ ఫర్ ఫ్యాన్..ఆంధ్రప్రదేశ్ సిద్ధం..అభివృద్ధి, సంక్షేమంలో జగన్ విజన్
అవినీతి నిర్మూలనకు ఏసీబీ దాడులు
20 Feb 2021 11:41 AM
వైయస్ జగన్ వచ్చాక ఏసీబీ దాడులు పెరిగాయి
చంద్రబాబు, జలీల్ఖాన్ అవినీతిపరులు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: అవినీతి నిర్మూలన కోసమే ఏసీబీ దాడులు నిర్వహిస్తున్నట్లు మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. దుర్గగుడిలో ఏసీబీ దాడులపై మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పందించారు. ప్రభుత్వంలో ఏసీబీ ఓ భాగమన్నారు. వైయస్ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక ఏసీబీ దాడులు పెరిగాయని... ఎక్కడా అవినీతి జరగకుండా ఉండటానికి దాడులు చేపడుతున్నట్లు చెప్పారు. ద్వారక తిరుమలలో కూడా గతంలో ఏసీబీ దాడులు జరిగాయని అన్నారు. కరోనామయంలో ప్రజలకు టీడీపీ నేతలు సాయం చేశారా అని ప్రశ్నించారు. టీడీపీ నేత జలీల్ఖాన్ వక్ఫ్ బోర్డు ఆస్తులు దోచుకున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో స్క్రాప్ జలీల్ఖాన్ అని విమర్శించారు. జలీల్ ఖాన్ ఓ సిగ్గులేని వ్యక్తి అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేగా ఉన్న జలీల్ ఖాన్ వక్ఫ్ బోర్డు ద్వారా కోట్లు అవినీతి చేశారని ఆరోపించారు. చంద్రబాబు, జలీల్ ఖాన్ అవినీతిపరులని మంత్రి వెల్లంపల్లి విమర్శించారు.