రేపు సీఎం వైయస్ జగన్ పులివెందుల పర్యటనఓటమి భయంతో బాబు నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్నాడుటీడీపీ, బిజేపి, జనసేన నేతలపై ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు మహిళల పాలిట రాక్షసుడు చంద్రబాబు! నువ్వెంతో, నీ బతుకెంతో వేలం పెట్టి చూసుకో చంద్రబాబూ..?అది కూటమి కాదు.. "కుమ్మక్కు" రాజకీయం! చంద్రబాబుని మహిళలు నమ్మే పరిస్థితి లేదుఎన్నికల నియమావళిని యధేచ్చగా ఉల్లంఘిస్తున్న ఘనత చంద్రబాబుదేపవన్ కల్యాణ్ కు ఎన్నికల అఫడవిట్ అంటే తెలుసాబస్సు యాత్ర వైయస్ఆర్సీపీ జైత్రయాత్రకు సంకేతం
హిందూ ధర్మం కాపాడే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుంది
16 Nov 2020 11:48 AM
మంత్రి వెల్లంపల్లి
విజయవాడ: హిందూ ధర్మం కాపాడే వారందరికీ ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఇంద్రకీలాద్రిపై మల్లేశ్వరస్వామి ఆలయ విస్తరణ పనుల శిలాఫలకాన్ని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సోమవారం ఉదయం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ...ఇంద్రకీలాద్రిపై అమ్మవారిని దర్శించుకొని మల్లేశ్వర స్వామి వారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేసే ప్రతిపక్షాన్ని, పత్రిక, ఛానల్స్ మూసేయాలని స్వామి వారిని వేడుకున్నానని తెలిపారు. గత ప్రభుత్వంలో దేవాలయాల అభివృద్ధికి ఒక్క రూపాయి ఇవ్వలేదని విమర్శించారు. గత ప్రభుత్వంలో దేవాలయాల్లో భవనాలను కూల్చేయడం, ఎఫ్డీలను ఇష్టానుసారం ఖర్చు చేశారన్నారు. తాంత్రిక పూజలు, చీర మాయం ఇవన్నీ గత ప్రభుత్వ హయాంలో జరిగినవే అని...తమ ముఖ్యమంత్రి వైయస్ జగన్ హయాంలో ఏపీలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నామన్నారు. భూములు అన్యాక్రాంతం కాకుండా చూస్తున్నామని తెలిపారు. కాని ప్రతిపక్షాలు మాత్రం అభివృద్ధి చేస్తామంటే కూడా అడ్డుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు. యనమల, అచ్చెంనాయుడు స్వరూపానంద స్వామిని దర్శించుకోలేదా అని ప్రశ్నించారు.