చంద్రబాబు మాట్లాడిన ప్రతి మాట అబద్ధమే మేమంతా సిద్ధం - 18వ రోజు షెడ్యూల్ఉరకలేసిన జనగోదావరి సీఎం వైయస్ జగన్పై దాడి పక్కా ప్రణాళికతో చేసిందేచంద్రబాబు వళ్లంతా దళితుల రక్తంతోనే తడిచింది...!కడియపులంకలో పోటెత్తిన జనం చంద్రబాబుకు ఓటుకు నోటు కేసులో శిక్ష తప్పదుజగనన్నే మా భరోసా బస్సు దిగి అంబులెన్స్లోని పేషెంట్ వద్దకు సీఎంగోదారమ్మ సాక్షిగా రావులపాలెంలో ఉప్పొంగిన జన గోదావరి
డైటింగ్ కోసమే లోకేష్ దీక్షలు
30 Oct 2019 12:42 PM
వరదల కారణంగా ఇసుక కొరత
ఇసుక కొరతను చంద్రబాబు రాజకీయంగా వాడుకుంటున్నారు
మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్
విజయవాడ: అధికారంలో ఉండే ఐదేళ్లు దోచుకున్నది అరగడానికి చంద్రబాబు తనయుడు లోకేష్ ఇసుక కొరత పేరుతో డైటింగ్ చేస్తున్నారని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ విమర్శించారు. రాష్ట్రంలో చంద్రబాబు, లోకేష్ అడుగు పెట్టడంతో గత ఐదేళ్లలో సకాలంలో వర్షాలు కురవలేదన్నారు. సీఎంగా వైయస్ జగన్ బాధ్యతలు చేపట్టాక విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయన్నారు. జలాశయాలన్నీ నీటితో కళకళలాడుతున్నాయన్నారు. వర్షాలు, వరదల కారణంగా ఇసుక కొరత ఏర్పడిందని చెప్పారు. దీన్ని చంద్రబాబు అవకాశంగా మార్చుకోవడం సిగ్గుచేటు అన్నారు. ఇసుక పేరుతో చంద్రబాబు ఐదు గంటల పాటు డైటింగ్ చేస్తున్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు దీక్షలు ప్రజల కోసం కాదని పేర్కొన్నారు.