బాబు ఆదేశాలతో బోండా చేయించిన దాడే అన్నది తేలిపోయింది! ఎన్నికల కమీషన్ కు వైయస్ఆర్సీపీ ఫిర్యాదులునేను బచ్చా అయితే.. నా చేతిలో ఓడిపోయిన నిన్ను ఏమనాలి బాబూ?ఇచ్చిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారుటీడీపీ గూండాలు మేకా వెంకటరెడ్డిని హత్య చేయడం కలచివేసింది సీపీఐని వీడి వైయస్ఆర్సీపీలో చేరిక ముస్లీం, క్రిస్టియన్ల మనోభావాలకు వ్యతిరేకి చంద్రబాబుటీడీపీని పైకి తీసుకురావడమే పవన్ అజెండానా? ఓటమి భయంతో బాబు హత్యా రాజకీయాలువర్లరామయ్యకు ఎన్నికల కమిషన్ నోటీసులు
కందుకూరు ఘటనపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించాలి
29 Dec 2022 1:02 PM
ముమ్మాటికీ రాజకీయ హత్యలే.. ప్రచార పిచ్చితో 8మందిని బాబు బలిగొన్నాడు
పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజం
విజయవాడ: చంద్రబాబు పబ్లిసిటీ పిచ్చి వల్లే కందుకూరులో 8 మంది అమాయకులు మృతిచెందారని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి రోజా ధ్వజమెత్తారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టి, డ్రోన్ కెమెరాతో వీడియోలు తీసి.. బాబు సభకు కిక్కిరిసిన జనం అని ఎల్లో మీడియాలో భజన చేయించుకోవాలని చూశాడని, ఆ పబ్లిసిటీ పిచ్చితోనే 8 మందిని బలితీసుకున్నాడని మండిపడ్డారు. నెల్లూరు జిల్లా కందుకూరు ఘటనపై మంత్రి రోజా స్పందించారు. మృతిచెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రచార యావ కోసం ప్రజల ప్రాణాలతో చంద్రబాబు చెలగాటం ఆడుతున్నాడని, 8 మందిని పొట్టన పెట్టుకున్న బాబును ఏం అనాలని ప్రశ్నించారు. చంద్రబాబు బాధ్యత లేకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడని, 8 మందిని బలిగొన్న చంద్రబాబుపై కోర్టులు సుమోటోగా కేసు స్వీకరించి విచారణ జరపాలని డిమాండ్ చేశారు. కందుకూరు చంద్రబాబు సభలో జరిగినవి ముమ్మాటికీ రాజకీయ హత్యలేనన్నారు.