రోడ్ల దుస్థితిపై టీడీపీ, బీజేపీల‌ను ప‌వ‌న్‌ ఎందుకు ప్ర‌శ్నించ‌లేదు?

మంత్రి ఆర్కే రోజా.. 
 

తిరుప‌తి: ఆంధ్రప్రదేశ్‌లో నాసిరకం పనులు చేసింది తెలుగుదేశం పార్టీ నాయకులేనని, రాష్ట్రంలో రోడ్ల దుస్థితికి కారణం తెలుగుదేశం పార్టీయే.. కానీ, టీడీపీ, బీజేపీని పవన్‌ కల్యాణ్ ఎందుకు ప్రశ్నించరు ? అని మంత్రి ఆర్కే రోజా నిలదీశారు. 
 రోడ్ల పరిస్థితిపై పవ‌న్ క‌ల్యాణ్‌ డిజిటల్ క్యాంపెయిన్ చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల హృదయాల్లో పవన్ కల్యాణ్ ఎప్పటికీ స్థానం సంపాదించలేరని ఆమె వ్యాఖ్యానించారు. తిరుపతిలో వైయస్సార్ వాహనమిత్రా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ తీరును ఎండ‌గ‌ట్టారు. ఈ సందర్భంగా  మంత్రి రోజా మాట్లాడుతూ..  పవన్ కల్యాణ్‌ను చూసి జనం నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశారు. పార్టీ పెట్టి ఎన్నికల్లోకి వెళ్లకుండా ఇతర పార్టీలకు ఓట్లేయమని చెప్పిన ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్‌ అంటూ సెటైర్లు వేశారు.
 
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశం కోసం అప్పులు చేయడం లేదా..? అని ప్రశ్నించిన ఏపీ మంత్రి.. అప్పులు తెచ్చినా అభివృద్ధి కోసం సీఎం వైయ‌స్‌ జగన్ డబ్బులు ఖర్చు పెడుతున్నారని స్పష్టం చేశారు. జనంలో తిరగని ఒకే ఒక వ్యక్తి పవన్ కల్యాణ్‌ అని ఆరోపించారు. 

Back to Top