ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటాం

మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై మంత్రి పెద్దిరెడ్డి స్పందన

సచివాలయం: మూడు రాజధానుల బిల్లు ఉపసంహరణపై పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. టెక్నికల్‌గా, లీగల్‌గా ఏదైనా తప్పులు ఉంటే సరిదిద్దడానికి ఈ పరిస్థితి వచ్చి ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కేబినెట్‌ సమావేశంలో తాను లేనని, పూర్తి వివరాలు తెలియదని చెప్పారు. ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామన్నారు. తెలుగుదేశం పార్టీ కావాలనే పెయిడ్‌ ఆర్టిస్టులను పెట్టుకొని రెండున్నరేళ్లుగా రాజధాని పేరుతో ఉద్యమం నడిపిస్తోందని, దీనికి ఈనాడు, ఆంధ్రజ్యోతి వంతపాడుతున్నాయన్నారు. ఇంటర్వెల్‌ మాత్రమే అయిందని, సినిమా శుభం కార్డు పడినప్పుడు తెలుస్తుందన్నారు. 

Back to Top